News April 2, 2024
స్కూళ్లలో రోజుకు 3సార్లు వాటర్బెల్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP: ఎండలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును తప్పించేందుకు పాఠశాలల్లో మూడు సార్లు వాటర్ బెల్ కొట్టాలని ఆదేశించింది. ఉదయం 8.45, 10.05, 11.50 గంటలకు బెల్ కొట్టాలని సూచించింది. విద్యార్థులు క్రమం తప్పకుండా మంచి నీటిని తాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒంటి పూట బడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
Similar News
News November 17, 2025
శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి: iBOMMA

ఐ-బొమ్మ వెబ్సైట్లో చివరి సందేశం దర్శనమిస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది. ఇటీవల <<18309765>>పోలీసులు<<>> మూవీ పైరసీ చేస్తున్న iBOMMA గుట్టురట్టు చేశారు. నిర్వాహకుడు ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు.
News November 17, 2025
శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి: iBOMMA

ఐ-బొమ్మ వెబ్సైట్లో చివరి సందేశం దర్శనమిస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది. ఇటీవల <<18309765>>పోలీసులు<<>> మూవీ పైరసీ చేస్తున్న iBOMMA గుట్టురట్టు చేశారు. నిర్వాహకుడు ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు.
News November 17, 2025
ఈ మాస్క్తో అవాంఛిత రోమాలకు చెక్

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వంశపారంపర్యం, హార్మోన్ల అసమతుల్యత, పలు అనారోగ్యాలు, కొన్ని మందులు వాడటం వల్ల ఇవి వస్తాయి. వీటిని తగ్గించాలంటే స్పూన్ జెలటిన్ పొడి, పాలు, తేనె, పసుపు కలిపి క్లీన్ చేసిన ముఖానికి అప్లై చేసుకోవాలి. కనుబొమ్మలు, కంటికి అంటకుండా మాస్క్ వేయాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా తొలగించాలి. తర్వాత ఐస్ క్యూబ్స్తో ముఖాన్ని రుద్ది మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది.


