News March 24, 2025
స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్: సీఎం

AP: ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంచినీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ‘ఉపాధి హామీ కూలీలు ఉ.6 నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలి. మున్సిపల్ కార్మికులకు మ.12 నుంచి సా.4గంటల్లోపు పనులు అప్పగించొద్దు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి ₹39Cr విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
మీకు తెలుసా?: యశోదమ్మే వకుళామాత

ద్వాపర యుగంలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోదా కలియుగంలో శ్రీనివాసుడి పెంపుడు తల్లి వకుళామాతగా జన్మించింది. కళ్లారా కృష్ణుడి పెళ్లి చూడాలన్న యశోద కోరికను కలియుగంలో తీరుస్తానని కృష్ణుడు వరమిస్తాడు. అందుకే ఆమె ఆధ్వర్యంలోనే శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. నేటికీ తిరుమలలోని బంగారు బావి పక్కన ఉన్న పోటులో ఆమె ఆసీనులై ఉంటారట. భక్తులకు అందించే అన్న ప్రసాదాల తయారీని పర్యవేక్షిస్తారని నమ్ముతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 25, 2025
చుండ్రుకు ఇలా చెక్

చలికాలంలో తలలో చుండ్రు ప్రభావం అధికంగా ఉంటుంది. దీనివల్ల దురద, డ్రై హెయిర్, హెయిర్ ఫాల్ సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించడంలో కరివేపాకు కీలకంగా పనిచేస్తుంది. కరివేపాకు, పెరుగు పేస్ట్ చేసి దాన్ని తలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి. అలాగే కరివేపాకు మరిగించిన నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. దీని వల్ల కూడా చుండ్రు సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
News November 25, 2025
పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

రిఫైన్డ్ ఫ్లోర్తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.


