News April 30, 2024
ఓయూలో నీటి కొరతపై జలమండలి వివరణ

TG: ఓయూలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని వస్తున్న వార్తలపై జలమండలి వివరణ ఇచ్చింది. ‘క్యాంపస్కు ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన దానికంటే ఎక్కువే సరఫరా చేస్తున్నాం. జలమండలి ఉన్నతాధికారులు సంబంధిత ఏఈతో కలిసి క్యాంపస్ను సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరం అయితే మరింత నీరు సరఫరా చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News November 5, 2025
ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?
News November 5, 2025
ఉమ్మనీరు ఎక్కువైతే ఏం చేయాలంటే?

తల్లికి షుగర్ నియంత్రణలో లేకపోతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్ గైడెడ్ ఆమ్నియోసెంటెసిస్ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. తల్లికి డెలివరీ కాంప్లికేషన్లు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకమై నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. కాబట్టి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది.
News November 5, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉ.కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు.


