News April 30, 2024
ఓయూలో నీటి కొరతపై జలమండలి వివరణ

TG: ఓయూలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని వస్తున్న వార్తలపై జలమండలి వివరణ ఇచ్చింది. ‘క్యాంపస్కు ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన దానికంటే ఎక్కువే సరఫరా చేస్తున్నాం. జలమండలి ఉన్నతాధికారులు సంబంధిత ఏఈతో కలిసి క్యాంపస్ను సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరం అయితే మరింత నీరు సరఫరా చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News February 5, 2026
లోక్సభకు రావద్దని మోదీకి చెప్పాను: స్పీకర్

ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయని, లోక్సభలోకి రావద్దని PM మోదీకి తాను సూచించినట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. కొందరు MPలు లోక్సభ ఛాంబర్లో దురుసుగా ప్రవర్తించారన్నారు. ‘<<19056579>>మోదీ ప్రసంగాన్ని<<>> అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని, ఊహించని పరిస్థితికి దారితీయొచ్చని సమాచారం వచ్చింది. అదే జరిగుంటే దేశ గౌరవం దెబ్బతినేది. నిన్నటి ఘటన పార్లమెంటు చరిత్రలో మాయనిమచ్చ’ అని అన్నారు.
News February 5, 2026
90 రోజులుగా నో ఛార్జ్షీట్.. ‘శబరిమల’ నిందితుడికి బెయిల్!

శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి రెండో కేసులోనూ బెయిల్ వచ్చింది. అతడిని అరెస్టు చేసి 90 రోజులైనా SIT ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో కేరళ కోర్టు statutory bail మంజూరు చేసింది. ద్వారపాలక విగ్రహం, గర్భగుడి తలుపుల ఫ్రేమ్స్లో బంగారం మాయంపై 2కేసులు అతడిపై నమోదయ్యాయి. దర్యాప్తులో తప్పు జరుగుతోందన్న తమ ఆరోపణలు ఈ బెయిల్తో నిజమని తేలాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
News February 5, 2026
సంకటహర చతుర్థి.. సాయంత్రం ఇలా చేయండి!

సంకటహర చతుర్థి ఎంతో విశిష్ఠమైందని పండితులు చెబుతున్నారు. ‘ఇవాళ విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని భక్తితో పూజిస్తే జీవితంలోని సంకటాలు, విఘ్నాలు తొలగిపోతాయి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం(నీళ్లు) సమర్పించాలి. తర్వాత గణేశుడిని పూజించుకోవాలి. కచ్చితంగా చంద్ర దర్శనం తర్వాతే ఉపవాసం విరమించుకోవాలి. ఇలా చేస్తే మనో ధైర్యం పెరిగి, బుద్ధి వికసిస్తుంది’ అని చెబుతున్నారు.


