News May 25, 2024

నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి: ఈటల

image

TG: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు అమలు కావడం లేదని ఫైరయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ పక్కదారి పట్టాయన్నారు. గ్రాడ్యుయేట్లను చిన్నచూపు చూసిన పార్టీలకు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Similar News

News November 6, 2025

చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్

image

AP: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆలోచనను CBN మార్చుకునేలా ఉద్యమాలు చేపట్టాలని YS జగన్ YCP విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై ‘రచ్చబండ’ ద్వారా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ‘ఈ ఉద్యమాలు ఎలా ఉండాలంటే CBNకు షాక్ తగిలేలా ఉండాలి. ఫీజు రీయింబర్స్‌మెంటుపై కూడా డిసెంబర్ వరకు టైమ్ ఇస్తాం. ఆ తరువాత ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థి విభాగం ఉండాలన్నారు.

News November 6, 2025

దేశంలో అత్యంత పురాతనమైన శివలింగం!

image

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగం గురించి తెలుసుకుందాం. తిరుపతి(D) గుడిమల్లం పరశురామేశ్వరాలయం అత్యంత పురాతనమైనదని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ ఆలయం క్రీ.పూ. 2వ శతాబ్దం నాటిదని, ఆలయంలోని శివలింగం సుమారు 2,300 ఏళ్లనాటిదని అంచనా వేశారు. ఇక్కడి లింగం సాధారణ రూపంలో కాకుండా, మానవ రూపంలో (వేటగాడి రూపం) రాక్షసుడి భుజాలపై నిలబడినట్లు ఉంటుంది.

News November 6, 2025

ఎస్‌బీఐ PO ఫలితాలు విడుదల

image

SBIలో 541 ప్రొబెషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు రిలీజయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను <>https://sbi.bank.in/<<>>లో అందుబాటులో ఉంచారు. వీరికి త్వరలో సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు ఆగస్టు 2, 4,5 తేదీల్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ 13న మెయిన్స్ ఎగ్జామ్ పూర్తయిన విషయం తెలిసిందే.