News July 8, 2025
జలాలే మన సంపద, వాటితోనే కష్టాలు తీరుతాయి: CBN

AP: ఇవాళ తన జీవితంలో సంతోషకరమైన రోజని CM చంద్రబాబు అన్నారు. జులై తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం శుభపరిణామం అని చెప్పారు. జలాలే మన సంపద అని, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని వ్యాఖ్యానించారు. ‘నీటి కరవు ఉన్న రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలామంది అన్నారు. కానీ ఆ ప్రాంత స్థితిగతులు మార్చేందుకు NTR నడుం బిగించారు. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నా’ అని వెల్లడించారు.
Similar News
News July 8, 2025
టెస్టుల్లో కొనసాగుతున్న సౌతాఫ్రికా జోరు

ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(WTC) గెలిచిన సౌతాఫ్రికా టెస్టుల్లో తన జోరు కొనసాగిస్తోంది. తాజాగా జింబాబ్వేను రెండో టెస్టులో చిత్తు చేసి వరుసగా 10వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ ముల్డర్(367*) విజృంభణతో 626-5 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 170 రన్స్కి ఆలౌటైన జింబాబ్వే ఫాలోఆన్లో 220కే పరిమితమైంది. దీంతో ఇన్నింగ్స్ 236 రన్స్ తేడాతో SA భారీ విక్టరీ నమోదు చేసింది.
News July 8, 2025
రేపు హాల్టికెట్లు విడుదల

AP: రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల హాల్టికెట్లు రేపు విడుదల కానున్నాయి. అభ్యర్థులు ఇక్కడ <
News July 8, 2025
జగన్ కారులో కూర్చున్నందుకు నాపై కేసు: పేర్ని నాని

AP: ఇటీవల మాజీ CM జగన్ కారులో వెనుక సీట్లో కూర్చుని ప్రయాణించినందుకు కూటమి సర్కార్ తనపై కేసు పెట్టిందని YCP నేత పేర్ని నాని మండిపడ్డారు. మరి గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతికి కారకుడైన చంద్రబాబుపై తమ ప్రభుత్వం వచ్చాక కేసులు పెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు 2029లో దీటుగా సమాధానం చెబుతాం. చెడు సంప్రదాయాలకు తెర తీస్తే పాపం అనుభవించక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు.