News March 9, 2025
ప్రయాగ్రాజ్లో నీరు చక్కగా ఉంది: కాలుష్య నియంత్రణ బోర్డు

కోటానుకోట్ల మంది ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలాచరించారు. అక్కడి నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు నివేదిక సమర్పించింది. గంగ, యమునా నదుల నుంచి కుంభమేళా సమయంలో కలెక్ట్ చేసిన నమూనాలపై పరిశోధనలు జరిపామని, స్నానం చేసేందుకు అనువైనవిగానే ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. కుంభమేళా టైమ్లో సంగమం వద్ద నీటి నాణ్యతపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News January 21, 2026
ఆ హీరోయిన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్!

బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారారు. సినిమా అవకాశాలు తగ్గాక దుబాయ్లో సెటిల్ అయ్యారు. ‘ఇక్కడ 95% మంది ప్రవాసులే. రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్రమశిక్షణ ఉంటుంది. ఏజెంట్లను ఆర్థిక సలహాదారులతో సమానంగా చూస్తారు. అదే ఇండియాలో 2నెలల బ్రోకరేజీ అడిగితే నేరం అన్నట్లుగా చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హిందీలో ధూమ్, హంగామా, గోల్మాల్తోపాటు తెలుగులో అందరివాడు మూవీలో ఆమె నటించారు.
News January 21, 2026
FLASH: పెరిగిన వెండి ధర

ఇవాళ ఉదయం నుంచి తటస్థంగా ఉన్న వెండి ధర మధ్యాహ్నం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.3,45,000కు చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,100, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,474గా ఉంది.
News January 21, 2026
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.


