News October 6, 2024

Way2News ఎఫెక్ట్: అదనపు కౌంటర్ల ఏర్పాటు

image

దసరా ఉత్సవాల నేపథ్యంలో నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి భక్తులు భారీగా వస్తున్నారు. ఈక్రమంలో దర్శన టికెట్ల కోసం భక్తులు పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై Way2Newsలో వార్త రావడంతో ఆలయ అధికారులు స్పందించారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్ల వద్ద కూడా టికెట్ల జారీకి శ్రీకారం చుట్టూరు. Way2Newsకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 9, 2025

జిల్లాలో 15, 16న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన: కలెక్టర్

image

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఈనెల 15, 16న రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 15 సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారన్నారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో తనతోపాటు ఇతర అధికారులతో ఎస్టిమేట్స్ కమిటీ 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సం.ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.

News December 9, 2025

రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

image

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్‌లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.

News December 9, 2025

నెల్లూరు: విద్యార్థులకు మరో అవకాశం.!

image

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ కే.సునీత తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఇంకా భర్తీ కాని సీట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు రాకపోయినా సీట్లు పొందే అవకాశం ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.