News July 31, 2024
వయనాడ్ విలయం.. 600 మంది వలస కార్మికులు గల్లంతు

కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలు, వరదల్లో 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ముండక్కైలో ఉన్న తేయాకు, కాఫీ తోటల్లో పనిచేసేందుకు వీరంతా బెంగాల్, అస్సాం నుంచి వచ్చారు. హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేస్తున్న వీరి ఆచూకీ తెలియడం లేదని సంస్థ GM బెనిల్ తెలిపారు. మొబైల్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో వారిని సంప్రదించలేకపోతున్నామన్నారు. ఆ ప్రాంతంలో 65 గృహాలు కొట్టుకుపోయినట్లు సమాచారం.
Similar News
News December 27, 2025
TGTET హాల్ టికెట్లు విడుదల

TGTET హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. TETకు అప్లై చేసుకున్నవారు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి 11.30గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సా.4.30గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. వెబ్సైట్: https://tgtet.aptonline.in/
News December 27, 2025
VHT: రోహిత్, కోహ్లీల శాలరీ ఎంతంటే?

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో వారికి ఎంత శాలరీ వస్తుందన్న చర్చ జరుగుతోంది. లిస్ట్-A మ్యాచ్లు 40కు మించి ఆడిన సీనియర్ కేటగిరీ క్రికెటర్లకు ఒక్కో మ్యాచ్కు రూ.60K ఇస్తారు. రిజర్వ్లో ఉంటే రూ.30K చెల్లిస్తారు. కోహ్లీ, రోహిత్ సీనియర్ కేటగిరీ ప్లేయర్లే కాబట్టి రూ.60K చెల్లిస్తారు. IPLతో పోలిస్తే చాలా తక్కువే అయినా దేశవాళీ క్రికెట్లో ఇది మంచి ఫీజు అనే చెప్పుకోవచ్చు.
News December 27, 2025
యూరియా కష్టాలు.. చిన్న ఫోన్లలో యాప్ ఎలా?

తెలంగాణలో దాదాపు 60% రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యూరియా కష్టాలు తప్పడం లేదు. వారి చిన్న ఫోన్ నంబర్లకే ఆధార్, భూముల వివరాలు లింకై ఉన్నాయి. ఫోన్ మార్చితే పథకాలు రద్దవుతాయని భయపడుతున్నారు. ఫలితంగా స్మార్ట్ ఫోన్ కొని యూరియా యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


