News February 3, 2025

WCలో త్రిష.. జిల్లా పేరు నిలబెట్టారు: భద్రాద్రి కలెక్టర్

image

ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గొంగడి త్రిషకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మలేసియాలో జరిగిన అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రాచలం వాసి గొంగడి త్రిషకు జిల్లా ప్రజలందరి తరఫున జిల్లా కలెక్టర్ అభినందనలు చెప్పారు. జిల్లా పేరును ప్రపంచ వేదికలో నిలబెట్టి, ఈరోజు చివరి మ్యాచ్లో అద్భుతంగా రాణించినందుకు అభినందించారు.

Similar News

News July 6, 2025

పాలమూరు: ఈ ఏడాది.. కొత్త స్కూళ్లు మంజూరు.!

image

ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయి. అన్ని వసతులు కల్పిస్తూ ప్రారంభించేందుకు DEOలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే MBNR-9,917, NGKL-9,010, GDWL-7,205, NRPT-8,454, WNPT-8,103 మంది విద్యార్థులు కొత్త అడ్మిషన్లు అయ్యారు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

News July 6, 2025

సామర్లకోట: యువకుడి హత్య.. నిందితుల అరెస్ట్

image

సామర్లకోట మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించినట్లు సీఐ కృష్ణ భగవాన్ శనివారం తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని, దర్యాప్తులో హత్యగా తేలిందని ఆయన వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 103(1), 238(a) r/w 3(5) బీఎంఎస్ కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు.

News July 6, 2025

శంషాబాద్: రేపు పోస్ట్ ఆఫీస్ సేవలు నిలిపివేత

image

పోస్ట్ ఆఫీస్ సేవలను సోమవారం నిలిపివేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి తెలిపారు. వినియోగదారులకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0ను ప్రవేశ పెడుతుంది. ఈనెల 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందులో భాగంగా రేపు పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని పేర్కొన్నారు.