News September 18, 2024
జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం: ఖర్గే
జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో తమ మద్దతు ఉండబోదని ప్రకటించారు. మల్టిపుల్ ఎన్నికలు నిర్వహించడంలో మోదీ, అమిత్ షాలకు ఏమైనా అభ్యంతరమా? అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News September 19, 2024
‘లారెన్స్ బిష్ణోయ్ని పిలవాలా?’.. సల్మాన్ తండ్రిని బెదిరించిన మహిళ
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ను ఓ మహిళ బెదిరించింది. ముంబైలోని కార్టర్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తి, మహిళ ఆయనను అడ్డగించారు. ‘లారెన్స్ బిష్ణోయ్ని పిలవాలా?’ అంటూ ఆమె బెదిరించింది. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, కామెడీగా అలా అన్నట్లు వారు తెలిపారు. గతంలో సల్మాన్ఖాన్ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే.
News September 19, 2024
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు మృతి
TG: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గోవా నుంచి వచ్చిన నితిన్ షా, జెడ్డా నుంచి వచ్చిన సకీనా అస్వస్థతకు గురై ఎయిర్పోర్టులోనే కుప్పకూలారు. సిబ్బంది వారిని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు.
News September 19, 2024
రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమం
AP: రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో పర్యటించనున్నారు.