News March 23, 2024

21 చోట్ల ‘మేమంతా సిద్ధం’ సభలు

image

AP: మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 4 ప్రాంతీయ ‘సిద్ధం’ సభలను నిర్వహించిన వైసీపీ.. రాష్ట్రంలోని 21 చోట్ల భారీ బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సభలకు ‘మేమంతా సిద్ధం’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది. ఈ నెల 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల, 29న ఎమ్మిగనూర్‌లో సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

Similar News

News July 8, 2024

ఉచిత ఇసుక: టన్ను రూ.1,394.. ఫ్లెక్సీలు వైరల్

image

AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఇవాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఈ రేటు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

News July 8, 2024

ఆర్మీ వాహనంపై టెర్రరిస్టుల దాడి

image

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కథువాలో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. కొండ పైనుంచి వెహికల్‌పై కాల్పులు జరిపి, గ్రెనేడ్స్ వేయడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిన్న కుల్గాంలో సైన్యం, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు ముష్కరులు చనిపోయారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

News July 8, 2024

మట్టి వినాయకులను పూజించండి: పవన్

image

AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయకచవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించారు. ‘మట్టి గణపతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్‌తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలి’ అని తనను కలిసిన పర్యావరణ ప్రేమికుడు విజయ రామ్‌తో పవన్ వ్యాఖ్యానించారు.