News December 30, 2024

మేం చాలా గొప్పగా పనిచేస్తున్నాం: పవన్

image

AP: గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. YCP అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, పనిచేసే సంస్కృతిని చంపేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు.

Similar News

News January 8, 2026

ఇంట్లో దేవుడి చిత్రపటాలు ఏ దిశలో ఉంటే ఉత్తమం?

image

పూజ గదిలో చిత్రపటాలను ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశ ముఖంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మనం పూజ చేసేటప్పుడు తూర్పు వైపునకు తిరిగి ఉండాలి. లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి పటాలను కలిపి ఉంచడం శుభకరం. పగిలిన లేదా చినిగిపోయిన పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. పటాలకు ప్రతిరోజు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

News January 8, 2026

SIR రెండో విడతలో 6.5 కోట్ల ఓట్లు తొలగింపు

image

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో విడతలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితాల నుంచి సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. SIRకు ముందు ఈ రాష్ట్రాల్లో 50.90 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 44.40 కోట్లకు తగ్గింది. ఇటీవల ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే <<18779886>>2.89కోట్ల మంది<<>> ఓటర్లను తొలగించారు.

News January 8, 2026

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు

image

AP: రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు గవర్నర్ జస్టిస్ నజీర్, CM చంద్రబాబు సహా 500 మంది అతిథులు హాజరవనున్నారు.