News July 9, 2024

ఏఐ రేసులో మనది ఐదో స్థానం!

image

ఏఐకి సంబంధించిన పేటెంట్ల నమోదులో భారత్ 2014-2023 మధ్య 55.8% వృద్ధిని నమోదు చేసింది. చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల కంటే ఇది ఎక్కువ. అయితే సంఖ్య పరంగా మనం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. 38,210 పేటెంట్లతో చైనా అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో US (6276), ద.కొరియా (4,155), జపాన్ (3,409) ఉన్నాయి. భారత్ 1,350 పేటెంట్లతో ఐదో స్థానంలో ఉన్నట్లు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వెల్లడించింది.

Similar News

News November 23, 2025

వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

image

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News November 23, 2025

సీట్స్ ఫుల్.. టికెట్స్ నిల్! తప్పదు చిల్లు..!!

image

AP: సంక్రాంతికి ఊరికి వెళ్దాం అనుకున్న వారికి ఈసారీ అధిక చెల్లింపు చిల్లు తప్పదేమో. పెద్ద పండుగకు ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు వెళ్లే రైళ్లు, విమానాల్లో టికెట్స్ బుక్ అయ్యాయి. రెండు నెలల ముందే సీట్స్ నిండి వెయిటింగ్ లిస్ట్ వందల్లో కన్పిస్తోంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్స్ రేట్స్ ఇప్పట్నుంచే పెంచేస్తున్నాయి. ఇంకేముంది.. ఎప్పట్లాగే ఈసారీ ప్రైవేటును ఆశ్రయించి ఛార్జీ వేటుకు గురవక తప్పదు.

News November 23, 2025

పర్సనల్ లైఫ్ తప్ప పైరసీపై నోరుమెదపని iBOMMA రవి?

image

iBOMMA నిర్వాహకుడు రవి నాలుగో రోజు విచారణలో తన లైఫ్‌స్టైల్ గురించి పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ‘పైరసీతో వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశా. 15-20 రోజులకొకసారి విదేశాలకు వెళ్లాను. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, US, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ తదితర దేశాలు తిరిగాను’ అని చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ విషయాలు తప్ప పైరసీ నెట్‌వర్క్ గురించి నోరు తెరవలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.