News July 9, 2024

ఏఐ రేసులో మనది ఐదో స్థానం!

image

ఏఐకి సంబంధించిన పేటెంట్ల నమోదులో భారత్ 2014-2023 మధ్య 55.8% వృద్ధిని నమోదు చేసింది. చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల కంటే ఇది ఎక్కువ. అయితే సంఖ్య పరంగా మనం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. 38,210 పేటెంట్లతో చైనా అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో US (6276), ద.కొరియా (4,155), జపాన్ (3,409) ఉన్నాయి. భారత్ 1,350 పేటెంట్లతో ఐదో స్థానంలో ఉన్నట్లు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వెల్లడించింది.

Similar News

News December 8, 2025

సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్‌(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 8, 2025

మూవీ ముచ్చట్లు

image

✦ ఈ నెల 12నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’

News December 8, 2025

INDIGO… NAIDU MUST GO: అంబటి

image

AP: ఇండిగో సంక్షోభాన్ని ముందుగా కనిపెట్టడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని YCP నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘INDIGO… NAIDU MUST GO!’ అంటూ రామ్మోహన్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రామ్మోహన్ తెలుగువారి పరువు తీశారని మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా సుమారు 5వేల విమాన సర్వీసులు రద్దవ్వగా 8లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.