News August 8, 2024
సోమరిపోతులు అవుతున్నాం.. కాస్త నడవండి!

స్టాన్ఫోర్ట్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో ఇండోనేషియా, సౌదీతో పాటు ఇండియా వంటి దేశాల్లోని ప్రజలు సోమరిపోతులయ్యారని తేలింది. 46 దేశాల్లోని 70,000 మంది స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయగా ఈ విషయం వెల్లడైంది. ఇండోనేషియన్లు సగటున రోజుకు 3,513 అడుగులు మాత్రమే నడిస్తే సౌదీలో 3,807 అడుగులేస్తున్నారు. ఇక 4,297 అడుగులతో ఇండియా మూడోస్థానంలో ఉంది. నగర ప్రజలు మోటారు వాహనాలపై ఎక్కువ ఆధారపడుతున్నట్లు తేలింది.
Similar News
News December 11, 2025
‘అఖండ-2’ నిర్మాతలకు షాక్.. హైకోర్టులో పిటిషన్

TG: ‘అఖండ-2’ సినిమా టికెట్ <<18524262>>ధరల పెంపునకు<<>> అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇవాళ రాత్రి ప్రీమియర్లు పడనున్నాయి.
News December 11, 2025
క్యాబినెట్ భేటీకి ఆలస్యం.. మంత్రులపై CM ఆగ్రహం

AP: క్యాబినెట్ భేటీకి లేట్గా వచ్చిన రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి, వాసంశెట్టి సుభాశ్ సహా మరో మంత్రిపై CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్యాబినెట్ లాంటి కీలక భేటీకి ఆలస్యం కావడం ఏమిటి? డిసిప్లిన్ లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించారు. కమ్యూనికేషన్ లోపంతో ఆలస్యం అయ్యామని మంత్రులు చెప్పగా మళ్లీ రిపీట్ కాకూడదని స్పష్టం చేశారు. కాగా కొందరు మంత్రులు గ్రౌండ్వర్క్ చేయడం లేదని CBN అసంతృప్తి వ్యక్తంచేశారని సమాచారం.
News December 11, 2025
చెరువుల్లో నీటి నాణ్యత – చేపలపై ప్రభావం

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.


