News August 8, 2024
సోమరిపోతులు అవుతున్నాం.. కాస్త నడవండి!

స్టాన్ఫోర్ట్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో ఇండోనేషియా, సౌదీతో పాటు ఇండియా వంటి దేశాల్లోని ప్రజలు సోమరిపోతులయ్యారని తేలింది. 46 దేశాల్లోని 70,000 మంది స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయగా ఈ విషయం వెల్లడైంది. ఇండోనేషియన్లు సగటున రోజుకు 3,513 అడుగులు మాత్రమే నడిస్తే సౌదీలో 3,807 అడుగులేస్తున్నారు. ఇక 4,297 అడుగులతో ఇండియా మూడోస్థానంలో ఉంది. నగర ప్రజలు మోటారు వాహనాలపై ఎక్కువ ఆధారపడుతున్నట్లు తేలింది.
Similar News
News December 10, 2025
వయ్యారిభామ అతి వ్యాప్తికి కారణమేంటి?

ఒక వయ్యారిభామ మొక్క 10 నుంచి 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు చాలా చిన్నవిగా ఉండి గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి అక్కడ మొలకెత్తుతాయి. అధిక విత్తన ఉత్పత్తి, విత్తన వ్యాప్తి, పశువులు తినలేకపోవడం ఈ మొక్కల వ్యాప్తికి ప్రధాన కారణం. వయ్యారిభామ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని, జూన్-జులైలో వర్షాల సమయంలో వృద్ధి చెంది, పొలాల్లో ప్రధాన పంటలతో పోటీ పడతాయి.
News December 10, 2025
తెలంగాణకు పట్టిన పీడను ఎలా వదిలించాలో తెలుసు: CM

తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో తనకు తెలుసని CM రేవంత్ అన్నారు. ‘ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారు. వందల ఎకరాల్లో ఫామ్హౌసులు కట్టుకున్న గత పాలకులు పదేళ్లలో దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకివ్వలేదు’ అని OU సభలో మండిపడ్డారు. ‘ఇంగ్లిష్ రాకపోయినా ఏం కాదు. నాలెడ్జ్, కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధ్యమే. జర్మనీ, జపాన్, చైనా వాళ్లకూ ఇంగ్లిష్ రాదు’ అని పేర్కొన్నారు.
News December 10, 2025
ఇండిగో క్రైసిస్.. 11 విమానాశ్రయాల్లో తనిఖీలు

ఇండిగో సేవల్లో <<18514245>>అంతరాయం<<>>తో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో DGCA కీలక నిర్ణయం తీసుకుంది. 11 విమానాశ్రయాల్లో ఆన్-సైట్ ఇన్స్పెక్షన్కు ఆదేశాలిచ్చింది. తిరుపతి, విజయవాడ, నాగ్పూర్, జైపూర్, భోపాల్, సూరత్, షిరిడీ, కొచ్చి, లక్నో, అమృత్సర్, డెహ్రాడూన్ ఎయిర్పోర్టుల్లో రెండు, మూడు రోజుల్లో తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇన్స్పెక్షన్ పూర్తయ్యాక 24 గంటల్లోగా నివేదికలు సమర్పించాలని కోరింది.


