News August 8, 2024

సోమరిపోతులు అవుతున్నాం.. కాస్త నడవండి!

image

స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో ఇండోనేషియా, సౌదీతో పాటు ఇండియా వంటి దేశాల్లోని ప్రజలు సోమరిపోతులయ్యారని తేలింది. 46 దేశాల్లోని 70,000 మంది స్మార్ట్‌ఫోన్లను ట్రాక్ చేయగా ఈ విషయం వెల్లడైంది. ఇండోనేషియన్లు సగటున రోజుకు 3,513 అడుగులు మాత్రమే నడిస్తే సౌదీలో 3,807 అడుగులేస్తున్నారు. ఇక 4,297 అడుగులతో ఇండియా మూడోస్థానంలో ఉంది. నగర ప్రజలు మోటారు వాహనాలపై ఎక్కువ ఆధారపడుతున్నట్లు తేలింది.

Similar News

News December 21, 2025

U19 Asia Cup: మరోసారి ‘కప్’ గొడవ?

image

మెన్స్ <<17879920>>ఆసియా కప్ ట్రోఫీ<<>> విషయంలో ACC చీఫ్ నఖ్వీతో వివాదం గురించి తెలిసిందే. ఇప్పటికీ ట్రోఫీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మరోసారి కప్ గొడవ జరిగేలా కనిపిస్తోంది. ఇండియా-పాక్ U19 Asia Cup <<18629192>>ఫైనల్‌‌<<>>కు నఖ్వీ హాజరవుతారని తెలుస్తోంది. మ్యాచ్ విన్నర్లకు ట్రోఫీని ఆయనే అందజేస్తారు. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఆయన నుంచి ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించే అవకాశం ఉంది. దీంతో నఖ్వీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.

News December 21, 2025

సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో: బీజేపీ

image

TG: సోనియా గాంధీ త్యాగాల వల్లే తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై BJP మండిపడింది. వ్యక్తిపూజలో రేవంత్ అన్ని హద్దులను దాటేశారని విమర్శించింది. సోనియా వల్లే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడని రేవంత్ త్వరలో చెబుతారేమోనని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

News December 21, 2025

నేలలో అధిక తేమ వల్ల ఏ సమస్యలు వస్తాయి?

image

నేలలో అధిక తేమ వల్ల కూరగాయల తోటల్లో నారుకుళ్లు, మొక్క ఎదుగుదల తగ్గటం, పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు, ఆకులు పసుపుబారటం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు.. ఆకుకూరల్లో మొక్క మొదలుకుళ్లు, ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. దుంప జాతుల్లో దుంప కుళ్లు, అధిక శాఖీయోత్పత్తి సమస్యలు కనిపిస్తాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ, మామిడిలో అధిక తేమ ప్రభావం ఎక్కువ.