News August 8, 2024

సోమరిపోతులు అవుతున్నాం.. కాస్త నడవండి!

image

స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో ఇండోనేషియా, సౌదీతో పాటు ఇండియా వంటి దేశాల్లోని ప్రజలు సోమరిపోతులయ్యారని తేలింది. 46 దేశాల్లోని 70,000 మంది స్మార్ట్‌ఫోన్లను ట్రాక్ చేయగా ఈ విషయం వెల్లడైంది. ఇండోనేషియన్లు సగటున రోజుకు 3,513 అడుగులు మాత్రమే నడిస్తే సౌదీలో 3,807 అడుగులేస్తున్నారు. ఇక 4,297 అడుగులతో ఇండియా మూడోస్థానంలో ఉంది. నగర ప్రజలు మోటారు వాహనాలపై ఎక్కువ ఆధారపడుతున్నట్లు తేలింది.

Similar News

News December 4, 2025

చనిపోయినట్లు నటించే బ్యాక్టీరియా!

image

అత్యంత అరుదైన బ్యాక్టీరియా(టెర్సికోకస్ ఫీనిసిస్)ను US సైంటిస్టులు కనుగొన్నారు. స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్ లాంటి భూమిపై ఉన్న అతి పరిశుభ్రమైన వాతావరణాలలోనూ ఇది జీవించగలదని తెలిపారు. ‘తన మనుగడను కొనసాగించడానికి చనిపోయినట్లు నటిస్తుంది. వీటిని గుర్తించడం, నాశనం చేయడం కష్టం. ఏదైనా బ్యాక్టీరియా వ్యాప్తి కట్టడికి కఠినమైన శుభ్రతా ప్రమాణాలు ఎందుకు పాటించాలో ఇలాంటివి నిరూపిస్తాయి’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

మనసునూ పట్టించుకోవాలి: సారా అలీఖాన్

image

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలాముఖ్యమని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ అంటున్నారు. భావోద్వేగాలను అణిచివేయడం బలం కాదు. వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు. ప్రస్తుత తరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టట్లేదు. శరీరానికి ఇచ్చే శ్రద్ధ మనసుకు కూడా ఇస్తేనే మనం బలంగా ఉన్నట్లు అర్థం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శ్రేయస్సు గురించి కూడా చర్చించాలంటున్నారు.

News December 4, 2025

సల్మాన్ ఖాన్ రాక.. కీరవాణి రాగం

image

TG గ్లోబల్ సమ్మిట్‌కు సినీ గ్లామర్ తోడవనుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సదస్సుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. సినీ ఇండస్ట్రీపై చర్చలో ఆయన పాల్గొంటారు. అటు ఈవెంట్ మొదట్లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి కన్సర్ట్ ఉండనుంది. సుమారు గంటన్నరపాటు ఆయన తన సంగీతంతో ఆకట్టుకోనున్నారు. బంజారా, కోలాటం, గుస్సాడీ, భారతనాట్యం వంటి కల్చరల్ ప్రోగ్రామ్‌లు అతిథులను అలరించనున్నాయి.