News October 18, 2024
ఇసుకపై సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు ఎత్తివేస్తున్నాం: చంద్రబాబు

AP: ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. సీనరేజ్ ఛార్జ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో సీఎం ఈమేరకు ప్రకటించారు. కాగా ఇప్పటికే రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఇవాళ సాయంత్రం <<14392031>>అనుమతి<<>> ఇచ్చింది.
Similar News
News October 20, 2025
BREAKING: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డీఏ 2024 జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమావేశమై ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఓ డీఏ నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 20, 2025
కూతుళ్లు అలా చేస్తే కాళ్లు విరగ్గొట్టాలి: ప్రజ్ఞా ఠాకూర్

భోపాల్(MP) మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హిందూయేతర పురుషుడి వద్దకు మనమ్మాయి వెళ్తానంటే కాళ్లు విరగ్గొట్టాలి. మన విలువలు పాటించని వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లల భవిష్యత్ కోసం కొట్టినా ఫరవాలేదు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతాం. కానీ పెద్దయ్యాక ఇతర మతస్థుడి ఇంటికి భార్యగా వెళ్తుంది. అలా జరగకుండా చూడాలి’ అని ఓ రిలీజియస్ ఈవెంట్లో సూచించారు.
News October 20, 2025
వంటింటి చిట్కాలు

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.