News February 13, 2025

కాంగ్రెస్ వాళ్లపై పింక్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నాం: MLC కవిత

image

తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న అరాచకాల్ని పింక్ బుక్‌లో నోట్ చేసుకుంటున్నామని BRS ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం కక్షపూరితంగా మా కార్యకర్తలపై కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా విమర్శలకు కూడా CM భయపడుతున్నారు. పోస్టు పెట్టిన తర్వాతి రోజే పోలీసులు ఇంటికొచ్చి వేధిస్తున్నారు. మీ లెక్కలన్నీ తేలుస్తాం’ అని హెచ్చరించారు.

Similar News

News February 13, 2025

ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులను రిటర్న్ చేస్తున్నారా?

image

ఆన్‌లైన్‌లో కొన్న వస్తువు నచ్చకపోతే రిటర్న్ పంపించేస్తుంటాం. అయితే అలా రిటర్న్ చేయడంలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. భారతీయులు 100 ప్రొడక్ట్స్ కొంటే అందులో 81 రిటర్న్ చేస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత చైనా (66), జర్మనీ (54), యూకే (50), అమెరికా (48), స్పెయిన్ (48), సౌత్ కొరియా (47), ఫ్రాన్స్ (46), ఆస్ట్రేలియా (44) దేశాలున్నాయి. INDలో ఎక్కువ మంది ఎందుకు రిటర్న్ పంపుతున్నారు?

News February 13, 2025

జట్టులో అంతమంది స్పిన్నర్లు ఎందుకు?: అశ్విన్

image

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విస్మయం వ్యక్తం చేశారు. ‘ఒక టూర్‌లో ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఐదుగురు స్పిన్నర్లా..? అది కూడా దుబాయ్ పిచ్‌లో ఆడేందుకు? మరీ ఎక్కువమందిని తీసుకున్నారనిపిస్తోంది. జడేజా, అక్షర్, కుల్‌దీప్, వరుణ్, సుందర్‌లో ఎవర్ని ఆడిస్తారు? ఎవర్ని పక్కన పెడతారు?’ అని ప్రశ్నించారు.

News February 13, 2025

లగ్జరీ కార్లతో స్టూడెంట్స్ రచ్చ.. షాకిచ్చిన పోలీసులు

image

గుజరాత్ సూరత్‌లోని ఓ స్కూల్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఇటీవల ఫేర్‌వెల్ పార్టీకి 35 లగ్జరీ కార్లతో వచ్చి <<15425002>>హల్‌చల్ చేశారు<<>>. లైసెన్సు లేకుండా కారు నడపడమే కాకుండా స్టంట్లు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ దృశ్యాలు వైరలవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. 22 కార్లను సీజ్ చేశామని, మరికొన్ని కార్లను గుర్తిస్తున్నామని DCP బరోత్ వెల్లడించారు.

error: Content is protected !!