News December 30, 2024

భద్రత విషయంలో మనకు అంత అదృష్టం లేదు: రాజ్‌నాథ్

image

భద్రత విషయంలో నిశ్చింతగా ఉండే అదృష్టం భారత్‌కు లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని వివరించారు. ‘ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు భద్రతపరంగా రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. అటు రెండు వైపులా సరిహద్దుల్లో, ఇటు అంతర్గత శత్రువులతో నిరంతరం పోరాటం తప్పదు. శత్రువులు మనల్ని ఎప్పుడు ఎలా దెబ్బతీయాలా అని ఎప్పుడూ చూస్తూనే ఉంటారు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలా? మీరేమంటారు?

image

తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షల మధ్య ఎక్కువ గ్యాప్ ఇచ్చామని విద్యాశాఖ చెబుతోంది. అయితే దీన్ని టీచర్ల ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్నిరోజుల గ్యాప్ వల్ల స్టూడెంట్స్ మరింత ఒత్తిడికి గురవుతారని, షెడ్యూల్‌లో లాజిక్ లేదని అంటోంది. విద్యార్థుల పేరెంట్స్‌గా మీ అభిప్రాయం ఏంటి?

News December 11, 2025

ఫ్లైట్ జర్నీలో సమస్యలుంటే ఇలా చేయండి

image

ఇండిగో సేవలు సాధారణస్థితికి వచ్చినా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘ప్రయాణికుల కంప్లైంట్స్ రియల్ టైమ్ పరిష్కారం కోసం క్రమం తప్పకుండా నిఘా ఉంచుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే Xలో @MoCA_GoIని ట్యాగ్ చేయండి. కంట్రోల్ రూమ్‌ను 011-24604283/011-24632987 నంబర్‌లలో సంప్రదించండి. AirSewa యాప్/వెబ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు’ అని ట్వీట్ చేశారు.

News December 11, 2025

మోదీకి నెతన్యాహు ఫోన్

image

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. గాజాలో శాంతి స్థాపనకు తమ సహకారం ఉంటుందని మోదీ పునరుద్ఘాటించారు.