News March 30, 2025
మా వల్లే తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం: సీఎం

AP: పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకే ఉగాది రోజు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పాతికేళ్ల క్రితం తెచ్చిన ఐటీ వల్ల రైతులు, కూలీల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మేం చేసిన అభివృద్ధి వల్ల తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం వస్తోంది. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నాం. నేను ఏ తప్పూ చేయలేదు. భవిష్యత్తులో చేయను’ అని స్పష్టం చేశారు.
Similar News
News April 1, 2025
IPL: టాస్ గెలిచిన పంజాబ్

లక్నోలో జరుగుతున్న LSGvsPBKS మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
జట్లు ఇవే:
PBKS: ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్, శశాంక్, శ్రేయస్, స్టొయినిస్, మ్యాక్స్వెల్, సూర్యాన్ష్, జాన్సెన్, చాహల్, ఫెర్గుసన్, అర్షదీప్
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, బదోనీ, మిల్లర్, సమద్, దిగ్వేశ్, శార్దూల్, బిష్ణోయ్, ఆవేశ్
News April 1, 2025
CBN, లోకేశ్, పవన్పై వైసీపీ ‘ఏప్రిల్ ఫూల్’ ట్వీట్

AP: ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా చంద్రబాబుకు డబ్బు కట్ట, లోకేశ్కు పాల డబ్బా, పవన్కు రిమోట్ను సింబల్స్గా పెట్టి వైసీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘వెరీ ఫేమస్ పాత్రలు.. స్కామర్ బాబు, పప్పు లోకేశ్, పవన్ కంట్రోల్. ఇప్పుడు మీ సమీపంలోని హెరిటేజ్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్ కోడ్ను ఉపయోగించి 50 శాతం డిస్కౌంట్ పొందండి. లేదా TDPFools కోడ్తో 100% తగ్గింపును పొందండి’ అని రాసుకొచ్చింది.
News April 1, 2025
దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయంటే?

దోమలు అందరిపై ఒకేలా దాడి చేయవు. ఎందుకంటే వాటికీ ఓ టేస్ట్ ఉంది. దోమలు ‘O’ గ్రూప్ రక్తాన్ని ఎక్కువగా ఇష్టపడతాయని ఓ పరిశోధనలో తేలింది. అందుకే O గ్రూప్ వ్యక్తులను ఎక్కువగా, A రకం వాళ్లని తక్కువగా కుడతాయి. అలాగే, చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా కీలకం. అవి చెమటతో కలిసినప్పుడు విడుదల చేసే వాసన దోమలను ఆకర్షించడమో, తిప్పికొట్టడమో చేస్తుంటాయి. గర్భిణులు, వ్యాయామం చేసే వారిపై దోమల ప్రభావం ఎక్కువ అని తేలింది.