News December 18, 2024

రూ.76వేల కోట్లు ఇవ్వాలని అడిగాం: పవన్

image

AP: జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పథకం అమలుకు ₹76వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు VJAలో జల్‌జీవన్ మిషన్ అమలుపై వర్క్‌షాప్‌లో తెలిపారు. ఈ పథకానికి అన్ని రాష్ట్రాలు ₹లక్ష కోట్లు అడిగితే, YCP ప్రభుత్వం ₹26వేల కోట్లే అడిగిందని ఆరోపించారు. ఈ స్కీంతో ప్రతి వ్యక్తికి 55 లీటర్ల నీళ్లు ఇచ్చి, ప్రధాని మోదీ కలను సాకారం చేస్తామన్నారు.

Similar News

News November 21, 2025

మొక్కలకు బోరాన్ ఎందుకు అవసరం?

image

బోరాన్ అనే ఈ సూక్ష్మధాతు మూలకం బోరిక్ యాసిడ్ స్థితిలో మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మొక్కల్లో, నేలల్లో నిశ్చల స్థితిలో ఉంటుంది. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారాన్ని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో, పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన, పండ్ల ఎదుగుదలను నిలువరిస్తుంది. మొక్క కాల్షియం గ్రహించడానికి తోత్పడుతుంది.

News November 21, 2025

మొక్కల్లో బోరాన్ లోపిస్తే ఏం జరుగుతుంది?

image

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపానికి సరైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ముడుచుకుపోతాయి.

News November 21, 2025

సీఎం మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ క్లారిటీ

image

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి Dy.CM డీకే శివకుమార్ తెరదించారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారని, అందుకు తానూ సహకరిస్తానన్నారు. తామిద్దరం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తామన్నారు. ‘అందరికీ మంత్రిపదవి అవకాశం రావాలని సీఎం యోచిస్తున్నారు. అందుకే క్యాబినెట్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీ MLAలు ఢిల్లీకి వచ్చారు’ అని తెలిపారు.