News December 18, 2024
రూ.76వేల కోట్లు ఇవ్వాలని అడిగాం: పవన్

AP: జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పథకం అమలుకు ₹76వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు VJAలో జల్జీవన్ మిషన్ అమలుపై వర్క్షాప్లో తెలిపారు. ఈ పథకానికి అన్ని రాష్ట్రాలు ₹లక్ష కోట్లు అడిగితే, YCP ప్రభుత్వం ₹26వేల కోట్లే అడిగిందని ఆరోపించారు. ఈ స్కీంతో ప్రతి వ్యక్తికి 55 లీటర్ల నీళ్లు ఇచ్చి, ప్రధాని మోదీ కలను సాకారం చేస్తామన్నారు.
Similar News
News November 20, 2025
ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<
News November 20, 2025
IIT రామయ్య@100: CM చెప్పినా సీటిచ్చేవారు కాదు!

TG: విద్యారంగంలో చుక్కా రామయ్య ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. 1925 నవంబర్ 20న జనగామ జిల్లా గూడూరులో జన్మించారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి, కళాశాల ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేశారు. తర్వాత Hydలో IIT కోచింగ్ సెంటర్ స్థాపించారు. CM స్థాయి వ్యక్తులు రిఫర్ చేసినా సీటు ఇచ్చేవారు కాదని స్వయంగా CBN ఒకసారి చెప్పారు. రామయ్య ఉమ్మడి ఏపీలో MLCగానూ సేవలందించారు. ఇవాళ 100వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
News November 20, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


