News May 30, 2024

ఐదేళ్ల క్రితం ఇదేరోజు అధికారంలోకి వచ్చాం: CM జగన్

image

AP: దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజు YCP అధికారంలోకి వచ్చిందని CM జగన్ ట్వీట్ చేశారు. ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మన పార్టీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది’ అంటూ గతంలో ప్రమాణస్వీకారం చేసిన ఫొటోను పోస్ట్ చేశారు.

Similar News

News April 4, 2026

మహబూబాబాద్ జిల్లాలో కార్యదర్శులకు డిప్యుటేషన్ల ఉత్తర్వులు

image

మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో 482 జీపీలకు 416 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. శనివారం 406 మంది పంచాయతీ సెక్రటరీలను డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపారు.

News April 4, 2026

విద్యార్థుల నుంచి ఫీజుల్ని వసూలు చేసుకోవచ్చు: హైకోర్టు

image

TG: ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు నిధుల విడుదలలో విఫలమైతే ఇంజినీరింగ్ కాలేజీలు 2026-27లో విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తిరిగి విద్యార్థులకు ఆ ఫీజుల మొత్తాలను రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంపై కాలేజీలు దాఖలు చేసిన 14 పిటిషన్లను విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

News April 4, 2026

పచ్చి పేడను నేరుగా పొలంలో వేస్తున్నారా?

image

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.