News January 25, 2025

కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు

image

AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.

Similar News

News December 16, 2025

కోడి గీతలతో YCP కోటి సంతకాల డ్రామా: సత్యకుమార్

image

AP: మెడికల్ కాలేజీల విషయంలో ప్రజా మద్దతు లేక YCP చీఫ్ జగన్ కోడి గీతలతో కోటి సంతకాల డ్రామా ఆడుతున్నారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా 10 వైద్య కళాశాలలను PPP విధానంలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జగన్ దాన్ని ప్రైవేటీకరణగా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం, కోర్టులు PPPని సమర్థించాయని, దీనిపై ఆయన కోర్టుకెళ్తేనే మేలని చెప్పారు.

News December 16, 2025

రూ.1,000 కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారుగా.. న్యాయమూర్తి ఆశ్చర్యం

image

TG: ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు చెల్లించట్లేదంటూ TGSPDCL గీతం యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ వర్సిటీ హైకోర్టుకు వెళ్లింది. 2008 నుంచి రూ.118 కోట్ల బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సామాన్యులు రూ.1,000 కట్టకపోతే అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారని, గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ SE హాజరుకావాలని ఆదేశించారు.

News December 16, 2025

SRHకు లివింగ్‌స్టోన్.. భారీ రేటు

image

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ₹2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ₹13 కోట్లకు దక్కించుకుంది. రచిన్ రవీంద్రను ₹2 కోట్లకు, ఆకాశ్ దీప్‌ను ₹కోటికి KKR కొనుగోలు చేసింది. రాహుల్ చాహర్‌ను ₹5.2 కోట్లకు, మ్యాట్ హెన్రీని ₹2 కోట్లకు, సర్ఫరాజ్ ఖాన్‌ను ₹75 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. జోష్ ఇంగ్లిస్‌ను ₹8.6 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.