News January 25, 2025

కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు

image

AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.

Similar News

News December 19, 2025

మానసిక ప్రశాంతతను పెంచే శివ నామం

image

‘ఓం స్థిరాయ నమః’ – ఈ సృష్టిలో కాలక్రమేణా అన్నీ మారుతుంటాయి. కొన్ని నశిస్తాయి. కానీ శివుడు అలా కాదు. ఏ మార్పు లేకుండా సర్వావస్థలందు సర్వకాలం స్థిరంగా ఉంటాడు. ఆయన జ్ఞానం, శక్తి, ఉనికి నిరంతరమైనవి. ఆయన పుట్టుక, పెరుగుదల, మరణం లేని ఆ స్థిరత్వాన్ని ఆశ్రయించడం వల్ల మనస్సులోని అలజడులు తగ్గి, మనకు పరిపూర్ణమైన మానసిక ప్రశాంతత, ధైర్యం లభిస్తాయి. ఆయన మార్పులేని అనంత తత్వానికి ఈ నామం నిదర్శనం. <<-se>>#SHIVANAMAM<<>>

News December 19, 2025

ఇంటర్ అర్హతతో 394 పోస్టులు.. అప్లై చేశారా?

image

UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్-2026కు దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాల్లో 394 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్(MPC) ఉత్తీర్ణులైనవారు DEC30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జులై1, 2007-జులై1, 2010 మధ్య జన్మించి ఉండాలి. *మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 19, 2025

పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు

image

AP: ప్రస్తుత జీవనశైలి, పెరిగిన ఖర్చులతో దంపతులు ఒకరిద్దరు పిల్లలకే పరిమితమవుతున్నారు. అయితే చిత్తూరు(D) ఆవల్ కండ్రిగలో ఓ జంట 21 ఏళ్లలో 14 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఏడుగురు మగ, ఏడుగురు ఆడపిల్లలు కాగా ఓ బాలిక చనిపోయింది. 13 కాన్పులు ఇంట్లోనే జరగగా 14వ కాన్పు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో జరగడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఇన్ని కాన్పులతో మహిళలకు తీవ్ర సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.