News July 24, 2024

రేవంత్, కేసీఆర్ దయ వల్ల మేము గెలవలేదు: కిషన్ రెడ్డి

image

TG: కేంద్రాన్ని తిట్టడం కోసమే రేవంత్ అసెంబ్లీలో చర్చ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి చేస్తేనే తమకు ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. రేవంత్, కేసీఆర్ దయ వల్ల తాము గెలవలేదని, 35 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ను బహిష్కరిస్తామనడం రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

Similar News

News October 16, 2025

WWC25: సెమీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా

image

ఉమెన్స్ ODI WC-2025లో సెమీ ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత BAN 198/9 స్కోర్ చేయగా, AUS 24.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. అలీసా హీలీ(113) సెంచరీతో మెరిశారు. లిచ్‌ఫీల్డ్(84) హాఫ్ సెంచరీ చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో హీలీ 20 ఫోర్లు బాదడం విశేషం. కాగా భారత్‌పై మ్యాచులోనూ హీలీ(142) అద్భుత సెంచరీ చేశారు.

News October 16, 2025

8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

image

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్‌ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.

News October 16, 2025

విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

image

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్‌ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.