News July 24, 2024
రేవంత్, కేసీఆర్ దయ వల్ల మేము గెలవలేదు: కిషన్ రెడ్డి

TG: కేంద్రాన్ని తిట్టడం కోసమే రేవంత్ అసెంబ్లీలో చర్చ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి చేస్తేనే తమకు ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. కేంద్ర బడ్జెట్పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. రేవంత్, కేసీఆర్ దయ వల్ల తాము గెలవలేదని, 35 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామనడం రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
Similar News
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.


