News July 24, 2024

రేవంత్, కేసీఆర్ దయ వల్ల మేము గెలవలేదు: కిషన్ రెడ్డి

image

TG: కేంద్రాన్ని తిట్టడం కోసమే రేవంత్ అసెంబ్లీలో చర్చ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి చేస్తేనే తమకు ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. రేవంత్, కేసీఆర్ దయ వల్ల తాము గెలవలేదని, 35 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ను బహిష్కరిస్తామనడం రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

Similar News

News November 28, 2025

RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

image

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్‌లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్‌లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.

News November 28, 2025

ALERT.. పెరగనున్న చలి

image

ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి (<10°C) పడిపోతాయని, HYDలో 10°Cగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ నెల 30 వరకు నార్త్, సెంట్రల్ TGలో 9-11°Cగా ఉంటాయన్నారు. తుఫాన్ ప్రభావంతో DEC 2-5 వరకు MHBD, భద్రాద్రి, సూర్యాపేట్, NGKL, వనపర్తి, MBNRలో మోస్తరు వర్షాలకు ఛాన్సుందని వివరించారు.

News November 28, 2025

సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

image

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.