News October 3, 2024

సన్యాసం స్వీకరించాలని ఎవరినీ అడగం: ఈశా ఫౌండేషన్

image

తమిళనాడు కోయంబత్తూరులోని <<14238933>>ఈశా<<>> యోగా కేంద్రంలో జరుగుతున్న పోలీసు తనిఖీలపై నిర్వాహకులు స్పందించారు. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించేందుకు సద్గురు ఈశా ఫౌండేషన్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ తామెవ్వరినీ అడగమని స్పష్టం చేశారు. కోర్టులో నిజమే గెలుస్తుందన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 4, 2026

రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

image

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ చేసింది. వీరు రేపు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారుగా ఉన్నారు.

News March 4, 2026

DMKతో పొత్తు ఖరారు.. 28 సీట్లలో కాంగ్రెస్ పోటీ

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పలుమార్లు చర్చలు, చిదంబరం-స్టాలిన్ భేటీ అనంతరం రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాంగ్రెస్‌కు 28 స్థానాలు కేటాయించేందుకు DMK అంగీకరించింది. అలాగే ఓ రాజ్యసభ సీటును ఇవ్వనుంది. 234 సీట్లున్న TN అసెంబ్లీకి వచ్చే ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

News March 4, 2026

గ్యాస్ ఉత్పత్తిని నిలిపేస్తున్నాం: ఖతర్

image

లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టుల ఉత్పత్తిని <<19269644>>నిలిపేస్తున్నట్లు<<>> ఖతర్ ప్రకటించింది. ‘గ్యాస్‌ను లిక్విడ్‌గా మార్చే ప్రక్రియను ఆపేస్తున్నాం. నెల రోజులు సూపర్ చిల్డ్ గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతి చేయలేం’ అని చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. గ్లోబల్ LNG ఎగుమతుల్లో ఖతర్‌ వాటా 20%. తాజా నిర్ణయంతో ఇండియా, జపాన్, చైనా, యూరప్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి.