News October 3, 2024

సన్యాసం స్వీకరించాలని ఎవరినీ అడగం: ఈశా ఫౌండేషన్

image

తమిళనాడు కోయంబత్తూరులోని <<14238933>>ఈశా<<>> యోగా కేంద్రంలో జరుగుతున్న పోలీసు తనిఖీలపై నిర్వాహకులు స్పందించారు. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించేందుకు సద్గురు ఈశా ఫౌండేషన్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ తామెవ్వరినీ అడగమని స్పష్టం చేశారు. కోర్టులో నిజమే గెలుస్తుందన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News November 22, 2025

HBTUలో 29 టీచింగ్ పోస్టులు

image

యూపీలోని హర్‌కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ (HBTU) 29 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. MCA, PG, PhD, ME, M.Tech, NET/SET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hbtu.ac.in/

News November 22, 2025

రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

image

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్‌ను ఇస్తుందని సూచించారు. SHARE IT

News November 22, 2025

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్‌లో శ్రద్ధా నటిస్తున్నారు.