News June 29, 2024

ఏపీలో పరిస్థితులను గవర్నర్‌కు వివరించాం: సుబ్బారెడ్డి

image

AP: YCP కార్యాలయాల్లోకి TDP నేతల అక్రమ చొరబాటు, దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసినట్లు YCP సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘టీడీపీ నేతల దాడులు పెరిగిపోతున్నాయి. అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఈ అంశాలపై వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరాం’ అని సుబ్బారెడ్డి తెలిపారు.

Similar News

News December 9, 2025

చైనాకు వెళ్తుంటే జాగ్రత్త!

image

భారతీయులు చైనాకు వెళ్తున్నా, ఆ దేశం మీదుగా ప్రయాణిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. ఇటీవల షాంఘై ఎయిర్‌పోర్టులో AR.P మహిళను <<18509379>>నిర్బంధించిన<<>> నేపథ్యంలో హెచ్చరించింది. భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. నిర్బంధించడం మానుకొని విమాన ప్రయాణ నిబంధనలు గౌరవిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

News December 9, 2025

షాంఘైలో మహిళ నిర్బంధం.. ఏం జరిగింది?

image

పెమా వాంగ్ అనే మహిళ గత నెల లండన్ నుంచి జపాన్ వెళ్తుండగా తన ఫ్లైట్ ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో ఆగింది. అయితే ఎయిర్‌పోర్ట్ అధికారులు తన పాస్‌పోర్టులో అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో అది చెల్లదని 18గంటలు నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఆపై IND ఎంబసీని సంప్రదిస్తే సాయం అందినట్లు చెప్పారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. AR.P ఎప్పటికీ INDలో భాగమే అని, అక్కడి ప్రజలు భారత్ పాస్‌పోర్ట్ కలిగి ఉంటారని చెప్పింది.

News December 9, 2025

డిసెంబర్ 9: చరిత్రలో ఈ రోజు

image

1946: ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ జననం
1970: టాలీవుడ్ డైరెక్టర్ వి.సముద్ర జననం
1975: హీరోయిన్ ప్రియా గిల్ జననం
1981: హీరోయిన్ కీర్తి చావ్లా జననం
2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
– అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం