News June 29, 2024

ఏపీలో పరిస్థితులను గవర్నర్‌కు వివరించాం: సుబ్బారెడ్డి

image

AP: YCP కార్యాలయాల్లోకి TDP నేతల అక్రమ చొరబాటు, దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసినట్లు YCP సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘టీడీపీ నేతల దాడులు పెరిగిపోతున్నాయి. అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఈ అంశాలపై వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరాం’ అని సుబ్బారెడ్డి తెలిపారు.

Similar News

News December 16, 2025

వే2న్యూస్ రీల్ రిపోర్టర్: ₹15,000కు పైగా సంపాదించే అవకాశం

image

Way2News ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా రీల్ రిపోర్టర్ల కోసం చూస్తోంది. మీకు కావలసిందల్లా ప్యాషన్, ఒక స్మార్ట్‌ఫోన్ మాత్రమే. న్యూస్ & ఇన్ఫర్మేటివ్ వీడియో రీల్స్ క్రియేట్ చేయండి. మీ కంటెంట్‌కి తగ్గట్టు ప్రతి నెల ₹15,000కు పైగా సంపాదించవచ్చు. రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్‌‌లో ఎవరైనా జాయిన్ కావచ్చు. వివరాలకు <>reelreporter.way2news.com<<>> కు వెళ్లండి.

News December 16, 2025

కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు

image

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.

News December 16, 2025

రుషికొండ ప్యాలెస్ కోసం టాటా, లీలా గ్రూపుల ప్రతిపాదనలు

image

AP: విశాఖ రుషికొండ భవనాలపై <<17985023>>GOM<<>> చర్చించింది. ‘ఈ భవనాలపై ప్రజాభిప్రాయం తీసుకున్నాం. హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్, లీలా ప్యాలెస్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వచ్చేవారం మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని మంత్రి కేశవ్ తెలిపారు. కాగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆదాయం పెరిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేశ్ చెప్పారు.