News December 19, 2024
18 OTTలను బ్లాక్ చేశాం: కేంద్ర మంత్రి

అసభ్య, అశ్లీల కంటెంట్ను ప్రమోట్ చేస్తున్న 18 OTTలను బ్లాక్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. SSUBT MP అనిల్ దేశాయ్ అడిగిన ప్రశ్నకు IT సహాయ మంత్రి L మురుగన్ లోక్సభలో జవాబిచ్చారు. 2024, మార్చి 14న 18 OTTలను బ్లాక్ చేసినట్టు చెప్పారు. ఈ అంశంలో అవి IT నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించినట్టు తెలిపారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లూ వాటిని పాటించాల్సి ఉంటుందన్నారు.
Similar News
News November 15, 2025
సెంచరీ కోసం నిరీక్షణ! అప్పుడు విరాట్.. ఇప్పుడు బాబర్

2019 నవంబర్ 23న సెంచరీ చేసిన విరాట్.. మరో సెంచరీ కోసం దాదాపు రెండున్నరేళ్లు నిరీక్షించారు. 2022, సెప్టెంబర్ 8న అఫ్గానిస్థాన్పై శతకదాహం తీర్చుకున్నారు. తాజాగా పాకిస్థానీ బ్యాటర్ బాబర్ ఆజమ్ అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2023, ఆగస్టు 30న సెంచరీ చేసిన బాబర్.. 807 రోజుల తర్వాత మరో సెంచరీ చేశారు. నిన్న శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అజేయ సెంచరీ సాధించి సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు తెరదించారు.
News November 15, 2025
సమూల ప్రక్షాళన దిశగా KCR అడుగులు!

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ బై పోల్ వరకూ BRS వరుస ఓటములతో సతమతమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే GHMC ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం చేకూరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ KCR సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అడ్హక్ కమిటీలతో పార్టీని నడిపిన ఆయన.. త్వరలోనే రాష్ట్రస్థాయి వరకూ కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
News November 15, 2025
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో ఛాన్స్

AP: 2026లో జరగనున్న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. అయితే రూ.2 వేల ఫైన్తో నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా చెప్పారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఫెయిలైన, ప్రైవేట్ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఫీజు చెల్లింపునకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.


