News December 19, 2024

18 OTTలను బ్లాక్ చేశాం: కేంద్ర మంత్రి

image

అసభ్య, అశ్లీల కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న 18 OTTలను బ్లాక్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. SSUBT MP అనిల్ దేశాయ్ అడిగిన ప్రశ్నకు IT సహాయ మంత్రి L మురుగన్ లోక్‌సభలో జవాబిచ్చారు. 2024, మార్చి 14న 18 OTTలను బ్లాక్ చేసినట్టు చెప్పారు. ఈ అంశంలో అవి IT నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించినట్టు తెలిపారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లూ వాటిని పాటించాల్సి ఉంటుందన్నారు.

Similar News

News January 17, 2026

యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

image

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

News January 17, 2026

C-DAC 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>C-DAC<<>> 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు నేటి నుంచి జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PG, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in

News January 17, 2026

పెళ్లికాని ఆడపిల్లలు తప్పక చేయాల్సిన పూజ

image

సావిత్రి గౌరీ వ్రతం, బొమ్మల నోము ముత్తయిదువులే కాకుండా, పెళ్లికాని ఆడపిల్లలకు కూడా ఎంతో ముఖ్యమైనది. వారు ఈ నోము నోచుకోవడం వల్ల పార్వతీ దేవికి శివుడు లభించినట్లుగా, తమకు కూడా సద్గుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని నమ్ముతారు. పూజా సమయంలో ‘గౌరీ కళ్యాణం’ వంటి పవిత్ర గాథలను చదువుకోవడం వల్ల మనసు నిర్మలమవుతుంది. సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుక పిల్లలలో భక్తి భావాన్ని, సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది.