News March 17, 2024
ఏపీకి 10 లక్షల ఇళ్లు ఇచ్చాం: మోదీ

AP: ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 10 లక్షల ఇళ్లు ఇస్తే.. పల్నాడులో 5వేల ఇళ్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద కోటి ఇళ్లకు నీరు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ కింద ఏపీలో కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలోనూ NDA ప్రభుత్వం రావాలి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News October 21, 2025
ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News October 21, 2025
స్వాతంత్య్ర సంగ్రామంలో సువర్ణ అధ్యాయం: ఆజాద్ హింద్ ఫౌజ్

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఈరోజు ఎంతో కీలకం. 1943లో సరిగ్గా ఇదే రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి, తాత్కాలిక స్వతంత్ర ప్రభుత్వాన్ని ప్రకటించారు. నేతాజీ నాయకత్వంలో వేలాది మంది సైనికులు దేశం కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. ‘చలో ఢిల్లీ’ నినాదంతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో భయం పుట్టించిన ఈ సైన్యం సాహసాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. *జై హింద్
News October 21, 2025
ట్రంపే కాదు.. ఆయన సెక్రటరీ అంతే!

US ప్రెసిడెంట్ ట్రంప్ నోటి దురుసు గురించి తెలిసిందే. ఈ విషయంలో తానేం తక్కువ కాదని వైట్హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ నిరూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో భేటీ కానున్నారు. ఈ హైలెవెల్ సమ్మిట్కు ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారని ఓ జర్నలిస్ట్ కరోలిన్కు మెసేజ్ చేశారు. ‘మీ అమ్మ చేసింది’ అని ఆమె బదులివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.