News December 3, 2024
దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచింది మేమే: మంత్రి డోలా

AP: ఇవాళ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారి పింఛన్ను రూ.6వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి అవసరమైన త్రీవీలర్స్, పరికరాలను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News December 7, 2025
నావల్ డాక్యార్డ్లో 320 పోస్టులు

విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్ 320 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. NAPS పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
News December 7, 2025
మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
News December 7, 2025
శని దోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి?

చేసే పనులకు అడ్డంకులు ఎదురైనా, ప్రతి విషయం ఆలస్యమైనా, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోయినా, మానసిక బాధ, నిరాశ వంటి లక్షణాలు శని దోషానికి సంకేతాలుగా భావించవచ్చు. అలాగే యవ్వనంలోనే జుట్టు రాలడం, కంటి చూపు మందగించడం, వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయత లేకపోవడం, తరచూ గొడవలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. శని దోషం ఉన్నట్లు నిర్ధారించుకోవడానికి మీ జన్మ తేదీ, సమయం ఆధారంగా జ్యోతిషుడిని సంప్రదించాలి.


