News February 25, 2025
6 నెలల్లో 4000 కి.మీ రోడ్లు వేశాం: పవన్

AP: NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 4వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1800 కి.మీ సీసీ రోడ్లు మాత్రమే వేసిందని విమర్శించారు. తమ పాలనలో 22వేలకు పైగా గోకులాలు నిర్మించామని, ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి 77 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపించారు.
Similar News
News February 25, 2025
అవి కేరళ చరిత్రలోనే అత్యంత క్రూరమైన హత్యలు: పోలీసులు

కేరళ తిరువనంతపురంలో యువకుడు అఫాన్(23) ఐదుగురు కుటుంబీకులను చంపిన <<15571171>>ఘటనలో<<>> దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘బాబాయ్ లతీఫ్ తలపై 20సార్లు సుత్తితో బాదాడు. ప్రియురాలు ఫర్జానా, పిన్ని సుజాత, తల్లి, తమ్ముడిని ఇలాగే హతమార్చాడు. వారి ముఖాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. 3ఇళ్లలో భయానక దృశ్యాలు కనిపించాయి. కేరళ చరిత్రలోనే ఈ హత్యలు అత్యంత క్రూరమైనవి’ అని పోలీసులు తెలిపారు.
News February 25, 2025
నీటి వినియోగం తగ్గించాలని APకి KRMB ఆదేశం

హైదరాబాద్లో నిన్న జరిగిన సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీరే తీసుకోవాలని ఏపీని ఆదేశించింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ తీసుకునే నీరు 7వేల క్యూసెక్కులకు తగ్గించాలని స్పష్టం చేసింది. అటు రేపు మరోసారి KRMB సమావేశం జరగనుండగా, ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
News February 25, 2025
డయాబెటిస్ పేషెంట్స్ ఈ టిప్స్ ట్రై చేయండి

భోజనం తర్వాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని టిప్స్ సూచించారు.1.గ్లాస్ వేడి నీటిలో టేబుల్ స్పూన్ ఆపిల్ వెనిగర్ను వేసుకొని తాగండి. 2 చియా గింజలను నీటిలో నానబెట్టి తాగండి. 3. దోసకాయ ముక్కల్నినిమ్మరసంతో కలిపి తినండి 4.ఆకుకూరల సలాడ్ తీసుకోండి. 5. కొన్ని వాల్నట్స్, బాదం తినండి . 6 గ్లాసు నీటిలో దాల్చిన చెక్క నానబెట్టి తాగండి. వీటిని ఫాలో అయ్యి మీ డయాబెటిస్ కంట్రోల్ ఉంచుకోండి.