News March 17, 2024
ఏపీని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాం: మోదీ

ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాం తిరుపతిలో ఐఐటీ, ఐసర్, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం’ అని తెలిపారు.
Similar News
News September 7, 2025
అక్టోబర్లో మోదీ-ట్రంప్ భేటీ?

ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే నెలలో కలిసే అవకాశం ఉంది. అక్టోబర్ 26-28 వరకు మలేషియాలో ASEAN సమ్మిట్ జరగనుంది. ట్రంప్ ఆ సమావేశానికి వస్తున్నారని మలేషియా ప్రధాని కన్ఫామ్ చేశారు. కానీ మోదీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా న్యూయార్క్(US)లో ఈనెల 23 నుంచి 29 వరకు జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) హైలెవెల్ డిబేట్కు PM మోదీ <<17627443>>హాజరుకావడం<<>> లేదు.
News September 7, 2025
త్వరలో కేటీఆర్ జిల్లాల పర్యటన!

TG: లోకల్ బాడీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో, 13న గద్వాలలో ఆయన పర్యటిస్తారు. దసరాలోగా వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇటు స్థానిక సంస్థలతో పాటు అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
News September 7, 2025
నేడే చంద్ర గ్రహణం.. ఈ పనులు మానుకోండి

నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ <<17628465>>సూతక కాల<<>> ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు. వండుకోవద్దు. ముందే వండిపెట్టిన ఆహారంపై దర్భ గడ్డి/తులసి ఆకులు వేసి ఉంచాలి. లేదంటే కలుషితం అవుతుంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు వద్దు. SEP 8, 1.26AMకి గ్రహణం ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.