News April 3, 2024

ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించాం: జగన్

image

AP: రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆస్తి కల్పించామని సీఎం జగన్ అన్నారు. ‘రూ.3 వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. ఎన్నో పథకాలతో అక్కచెల్లెమ్మలకు అండగా ఉన్నాం. మహిళలకు ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ రూ.లక్షల్లో ఉంటుంది. ఇప్పటివరకు రూ.2.70 లక్షల కోట్లు మీ ఖాతాల్లో నేరుగా వేశాం. 130 సార్లు మీ బిడ్డ జగన్ బటన్ నొక్కారు. నా కోసం రెండు సార్లు బటన్లు నొక్కండి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 9, 2026

ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం.. ఎక్కడో తెలుసా?

image

నిజంగా ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం ఇస్తే ఎంత బాగుంటుందో కదా! స్పెయిన్‌లోని అరెనిల్లాస్ అనే గ్రామం ఫ్యామిలీస్‌కు ఈ ఆఫర్ ఇస్తోంది. అయితే స్కూలుకు వెళ్లే పిల్లలు ఉండాలని, శాశ్వతంగా అక్కడే నివసించాలని, విలేజ్ బార్ నడపాలని, మున్సిపల్ పని చేయాలని కండిషన్లు పెడుతోంది. ప్రస్తుతం అక్కడ 40 మందే ఉండటంతో జనాభా పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ప్రకటన చేయగానే 100 దరఖాస్తులు వచ్చాయట.

News April 9, 2026

రాజ్ లేకుండా ఒక్క రోజూ ఉండలేను.. సమంత ఎమోషనల్

image

తన భర్త రాజ్ గురించి చెబుతూ హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. ‘నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. తర్వాత నేను ఒక బెటర్ పర్సన్‌గా, బెటర్ యాక్ట్రెస్‌గా కావడానికి భర్త రాజ్ కారణం. మేం కలిసే వర్క్, వర్కవుట్స్ చేస్తాం. గేమ్స్ ఆడతాం. ఆయనను విడిచి నేను ఒక్క రోజు కూడా ఉండలేను’ అని పేర్కొన్నారు. కాగా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మే 15న విడుదల కానుంది.

News April 9, 2026

పాస్ పుస్తకాల్లో కరెన్సీకి వాడే టెక్నాలజీ: సీఎం

image

AP: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని, అది జీవనాధారం, భద్రత, గౌరవమని CM CBN చెప్పారు. YCP హయాంలో ప్రజల భూమిపై కన్నేశారని ఆరోపించారు. బాపట్ల(D) సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ సభలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పటికే 21.23L కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చాం. జులై నాటికి మరో 9 లక్షలు, 2027 మార్చికి 80 లక్షల పాస్ బుక్స్ అందిస్తాం. కరెన్సీకి వాడే టెక్నాలజీ ఇందులో వాడుతున్నాం. వీటిని ఎవరూ ట్యాంపర్ చేయలేరు’ అని చెప్పారు.