News April 6, 2024

మా టార్గెట్ రీచ్ అయ్యాం: దిల్ రాజు

image

‘ఫ్యామిలీ స్టార్’ మూవీ విషయంలో టార్గెట్ రీచ్ అయ్యామని నిర్మాత దిల్ రాజు అన్నారు. మీడియా నుంచి రివ్యూస్ ఒకలా ఉన్నాయని.. కుటుంబ ప్రేక్షకుల నుంచి టాక్ వేరేలా ఉందన్నారు. వారిలో 90శాతం మందికి ఫ్యామిలీ స్టార్ మూవీ నచ్చిందని పేర్కొన్నారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని సినిమా తీసినట్లు చెప్పారు. కుటుంబాన్ని గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చిన ఫ్యామిలీ స్టార్స్‌ని గుర్తించి కలవనున్నట్లు తెలిపారు.

Similar News

News November 26, 2025

JN: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల కమిషనర్

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు, ఆదేశాలను జారీచేశారు. ఈ సమావేశంలో జనగామ జిల్లా నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News November 26, 2025

iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

image

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.

News November 26, 2025

Official: అహ్మదాబాద్‌లో కామన్ వెల్త్ గేమ్స్

image

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌ ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్‌ అధికారికంగా ఖరారైంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్‌వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్‌కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడలు ఉండనున్నాయి. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే గేమ్స్‌లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉండనున్నాయి. కాగా 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ కావడం గమనార్హం.