News September 11, 2024
వాల్మీకి స్కామ్ గురించి మేమన్నదే నిజమైంది: కేటీఆర్

TG: వాల్మీకి కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మేమన్నదే నిజమైంది. ఈ స్కామ్ ద్వారా రూ.187 కోట్లు దారిమళ్లాయి. ఆ సొమ్మును T కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ HYDకు చెందిన బిల్డర్. ఇద్దరు TG కాంగ్రెస్ నేతలకు అత్యంత సన్నిహితుడు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 2, 2026
టూరిస్ట్ స్పాట్గా డంప్యార్డ్.. ఎలా మారింది?

రాజస్థాన్లోని కిషన్గఢ్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు SMలో సెన్సేషన్గా మారింది. ‘రాజస్థాన్ స్విట్జర్లాండ్’గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి మార్బుల్ వ్యర్థాల డంప్యార్డ్. మార్బుల్ కటింగ్ నుంచి వచ్చే తెల్లటి పౌడర్ కొండల్లా పేరుకుపోయి వర్షపు నీరు చేరడంతో అచ్చం మంచు కొండల మధ్య నీటి సరస్సులా కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఇన్స్టా రీల్స్, సినిమా షూటింగ్స్కి అడ్డాగా మారింది. ఈ డస్ట్ ఆరోగ్యానికి ప్రమాదకరం.
News February 2, 2026
ఫైనల్లో భారత్ ఎదురైతే.. పాక్కు మాజీల ప్రశ్న!

T20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు. ‘ఫస్ట్ మ్యాచ్ బాయ్కాట్ సరే.. మరి ఫైనల్లో భారత్ ఎదురైతే అప్పుడు ఆడకుండానే కప్పు వారికిచ్చేస్తారా?’ అని దానిశ్ కనేరియా ప్రశ్నించారు. ఇది పాక్ భయపడుతోందనే సంకేతం ఇస్తుందని విమర్శించారు. మరోవైపు ‘క్రికెట్ ద్వారా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, భారత్తో ఆడకపోవడం బాధాకరమని అఫ్రీది అభిప్రాయపడ్డారు.
News February 2, 2026
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదు: సజ్జల

AP: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, బందిపోట్ల మాదిరి TDP తమ నేతల ఇళ్లపై దాడులు చేస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ల ఆదేశాలతో అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై పోలీసుల సమక్షంలోనే గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. లడ్డూ అంశంలో దొరికిపోవడంతో CBN ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక CBNకి రిటర్న్ గిఫ్ట్ తప్పని సరిగా ఇస్తామని హెచ్చరించారు.


