News September 11, 2024
వాల్మీకి స్కామ్ గురించి మేమన్నదే నిజమైంది: కేటీఆర్

TG: వాల్మీకి కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మేమన్నదే నిజమైంది. ఈ స్కామ్ ద్వారా రూ.187 కోట్లు దారిమళ్లాయి. ఆ సొమ్మును T కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ HYDకు చెందిన బిల్డర్. ఇద్దరు TG కాంగ్రెస్ నేతలకు అత్యంత సన్నిహితుడు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 3, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు

<
News February 3, 2026
వంటింటి చిట్కాలు

* గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసుకొని ఓ గంటపాటు పెరుగులో నానబెట్టి దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే చాలు.
* కూరల్లో గ్రేవీ పలుచగా అయితే కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, దానిని కాసేపు ఫ్రిజ్లో ఉంచి, చాకుతో కోయాలి.
* సాంబారు రుచిగా ఉండాలంటే మసాలా పొడిలో కొద్దిగా నిమ్మరసం చేర్చాలి.
News February 3, 2026
నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

AP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఉదయం పార్లమెంట్కు వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు. రేపు అర్ధరాత్రికి ఆయన తిరిగి ఉండవల్లికి చేరుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.


