News March 21, 2024
ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తాం: జూపల్లి

TG: నిజామాబాద్ జిల్లాలో ఇటీవల వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10వేల పరిహారం అందజేస్తామన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ఏనాడూ రైతులను ఆదుకోలేదని విమర్శించారు. వచ్చే పంట కాలానికి ప్రతి రైతు పంటకు ఇన్సూరెన్స్ చేస్తామని వెల్లడించారు. అన్నదాతలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి పునరుద్ఘాటించారు.
Similar News
News October 24, 2025
విగ్రహంలో దేవుడు ఉంటాడా?

భగవంతునికి చంచల, నిశ్చల అనే రెండు రూపాలున్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో చలనము లేని రూపమే విగ్రహం. ఈ రూపంలో కూడా పరమాత్మ నిత్యం కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విగ్రహాన్ని రాతిగా చూడరాదని అంటుంటారు. భక్తుల కోసం, భక్తుల ఆరాధన కోసం భగవంతుడు తన లీల ద్వారా ఈ రూపంలో కొలువై ఉంటాడట. భక్తులచే పూజలందుకొని అనుగ్రహాన్ని కల్పిస్తాడట. విగ్రహంలో దేవుడు లేడన్న మాట అవివేకం. <<-se>>#WhoIsGod<<>>
News October 24, 2025
చిన్నారుల్లో హెయిర్ ఫాల్ అవుతోందా?

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హెయిర్ఫాల్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం. పిల్లలకు ఐరన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారం పెట్టడంతో పాటు జుట్టును గట్టిగా లాగి దువ్వడం, బిగించడం మానుకోవాలంటున్నారు. కొంతమంది పిల్లల్లో జ్వరాలు వచ్చి తగ్గాక కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.
News October 24, 2025
19 మృతదేహాలు వెలికితీత

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


