News October 28, 2024

ముగ్గురు హెజ్బొల్లా నేతల్ని అంతం చేశాం: ఇజ్రాయెల్

image

లెబనాన్‌లోని బింట్ జెబీల్ ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థకు చెందిన ముగ్గురు కీలక నేతల్ని వైమానిక దాడుల్లో హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ట్విటర్‌లో ప్రకటించింది. వారిలో బింట్ జెబీల్ కమాండర్ అహ్మద్ జాఫర్, అతడి తర్వాత కమాండర్ కావాల్సిన వ్యక్తి, ఆర్టిలరీ హెడ్‌లు ఉన్నారని స్పష్టం చేసింది. తమ దేశంపై జరిగిన అనేక దాడుల్లో వీరి ప్రమేయం ఉందని తెలిపింది.

Similar News

News April 1, 2026

మేం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు: జగన్

image

AP: అమరావతికే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తాము వ్యతిరేకం కాదని ప్రెస్‌మీట్‌లో YCP చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ‘అమరావతి పేరుపై అప్పులు తెచ్చి స్కామ్‌లు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీకి రూ.2లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చు చేసే స్థోమత మనకు ఉందా? ఏడేళ్లలో CBN ఖర్చు పెట్టింది రూ.8వేల కోట్లే. వీటికి అసెంబ్లీలో CBN సమాధానం చెప్పాడా?’ అని ప్రశ్నించారు.

News April 1, 2026

టీ తోటలో మోదీ.. కార్మికులతో ముచ్చట్లు

image

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిబ్రూగఢ్‌లోని టీ తోటలను సందర్శించారు. అక్కడ తేయాకు కోస్తున్న మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న మోదీ.. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో వారి శ్రమ అమూల్యమైనదని కొనియాడారు. తోటల్లో మహిళలతో కలిసి సరదాగా కాసేపు తేయాకు కోశారు. ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.

News April 1, 2026

IPL: శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్

image

IPL-19 సీజన్‌లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్‌దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.