News March 21, 2025
కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అదే రోజు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. ఇంఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని సీఎం అన్నారు.
Similar News
News December 1, 2025
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.
News December 1, 2025
ఐటీ రంగంలో పెరుగుతున్న HIV కేసులు!

దేశంలో IT రంగానికి చెందిన వారిలో HIV కేసులు పెరిగిపోతున్నాయని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) హెచ్చరించింది. మత్తు ఇంజెక్షన్లు, రక్షణ లేని శృంగారం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోందని NACO వర్గాలు చెప్పాయి. వ్యవసాయ కూలీల్లోనూ కేసులు ఎక్కువైనట్లు తెలిపాయి. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు టెస్టులు పెంచాలని సూచించాయి. ఎయిడ్స్ కేసుల్లో మహారాష్ట్ర(3,62,392), AP(2,75,528) టాప్లో ఉన్నాయి.
News December 1, 2025
మహాభారతంలో భాగమే భగవద్గీత

వ్యాసుడు రచించిన మహాభారతంలో ఓ భాగమే భగవద్గీత అనే విషయం చాలామందికి తిలిసే ఉంటుంది. భారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలను భగవద్గీతగా చెబుతారు. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఇవి మనం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నేర్పుతాయి. బంధువులను చంపడానికి విముఖత చూపిన అర్జునుడిని ధర్మ మార్గాన్ని చూపడానికి, ధర్మాన్ని గెలిపించడానికి కృష్ణుడు గీతబోధ చేశాడు.


