News March 30, 2025

నారా లోకేశ్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం: సోమిరెడ్డి చంద్రమోహన్

image

AP: పార్టీలో రెండు టర్మ్‌లు ఓ పదవిలో పనిచేసినవారు పై స్థాయికి వెళ్లాలి లేదా టర్మ్ గ్యాప్ తీసుకోవాలన్న మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు TDP సీనియర్లు మద్దతు పలికారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్కొన్నారు. ‘లోకేశ్ ప్రతిపాదనకు మద్దతునిస్తున్నాం. 2012 నుంచి నేను టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నాను. నా స్థానంలో వేరొకరికి అవకాశమివ్వాలనుకుంటే నేను సిద్ధం’ అని పేర్కొన్నారు.

Similar News

News April 1, 2025

వడగాలులు, పిడుగులతో వర్షాలు.. రేపు జాగ్రత్త

image

AP: రాష్ట్రంలో రేపు 30, ఎల్లుండి 47 మండలాల్లో <>వడగాలులు ప్రభావం చూపే<<>> అవకాశం ఉన్నట్లు APSDMA వెల్లడించింది. రేపు శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో, గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

News April 1, 2025

జొమాటోలో 600 మంది ఉద్యోగులు ఔట్

image

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన ఉద్యోగులకు షాకిచ్చింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్న దాదాపు 600 మందిని తొలగించింది. ఈ విభాగంలో ఏడాది కిందట 1,500 మందిని నియమించుకోగా, ఇంతలోనే పలువురికి లేఆఫ్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పేలవమైన పనితీరు, ఆలస్యంగా రావడం వంటి కారణాలు చూపుతూ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తొలగించినట్లు సిబ్బంది వాపోతున్నారు.

News April 1, 2025

ట్రంప్ సుంకాల ప్రభావం.. ఈ దేశాలే లక్ష్యం?

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా 10 నుంచి 15 దేశాలపై వాటి ప్రభావం ఉంటుందని అంచనా. చైనా, ఐరోపా సమాఖ్య దేశాలు, మెక్సికో, వియత్నాం, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, భారత్, థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!