News April 24, 2024
స్టీల్ ప్లాంటుపై మొదట గళమెత్తింది మేమే: జగన్

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలతో CM జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, వైసీపీ.. కార్మికులకు అండగా నిలుస్తాయని జగన్ భరోసానిచ్చారు. కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే మొదట గళమెత్తిందని, ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఇప్పుడు జట్టుకట్టాయని, కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. కేంద్రంపై నిరంతరంగా ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, కార్మికుల మద్దతు కోరే నైతికత వైసీపీకి ఉందని వ్యాఖ్యానించారు.
Similar News
News January 11, 2026
APPLY NOW: NABARDలో 44 పోస్టులు

<
News January 11, 2026
‘రాజాసాబ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

‘రాజాసాబ్’ సినిమా భారత్లో రెండు రోజుల్లో ₹108.4కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెబ్సైట్ పేర్కొంది. ప్రీమియర్లకు ₹11.3Cr, తొలి రోజు ₹64.3Cr, రెండో రోజు ₹32.84Cr కలెక్షన్స్ వచ్చినట్లు వెల్లడించింది. హిందీలో 2 రోజుల్లో ₹11.2Cr రాబట్టినట్లు తెలిపింది. కాగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹112Cr+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 11, 2026
ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.


