News April 24, 2024

స్టీల్ ప్లాంటుపై మొదట గళమెత్తింది మేమే: జగన్

image

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలతో CM జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, వైసీపీ.. కార్మికులకు అండగా నిలుస్తాయని జగన్ భరోసానిచ్చారు. కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే మొదట గళమెత్తిందని, ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఇప్పుడు జట్టుకట్టాయని, కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. కేంద్రంపై నిరంతరంగా ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, కార్మికుల మద్దతు కోరే నైతికత వైసీపీకి ఉందని వ్యాఖ్యానించారు.

Similar News

News January 25, 2026

బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగింది: నఖ్వీ

image

T20 WC నుంచి తప్పించి బంగ్లాదేశ్‌కు ICC అన్యాయం చేసిందని PCB ఛైర్మన్ మోషిన్ <<18947264>>నఖ్వీ<<>> అన్నారు. ‘భారత్, పాకిస్థాన్ కోసం వెన్యూలు మార్చినప్పుడు బంగ్లాదేశ్ కోసం ఎందుకు మార్చరు? ఐసీసీని ఒకే దేశం డిక్టేట్ చేస్తోంది. ఐసీసీకి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. ఓ దేశం కోసం నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. మరో దేశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. అందుకే మేం బంగ్లాదేశ్‌కు మద్దతిస్తున్నాం’ అని తెలిపారు.

News January 25, 2026

వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా?

image

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహరాజా రవితేజ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త తరహా కథలను తెరకెక్కించే వివేక్ ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. రజినీకాంత్, సూర్యకు ఆయన స్టోరీ వినిపించారని అంతకుముందు ప్రచారం జరిగింది. కానీ అవి ఓకే కాలేదని తెలుస్తోంది. కాగా రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

News January 25, 2026

నో కాస్ట్ EMI.. మీకు ఈ విషయాలు తెలుసా?

image

‘నో కాస్ట్ EMI’తో ఆన్‌లైన్‌లో వస్తువులు కొంటే వడ్డీ ఉండదని అనుకుంటాం. కానీ వస్తువు ధరలోనే వడ్డీ కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ‘నో కాస్ట్ EMI వల్ల భారీ డిస్కౌంట్లు కోల్పోతారు. అదనంగా ప్రాసెసింగ్ ఫీజు+GST కూడా చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ EMIల వల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ పెరిగి సిబిల్ స్కోర్ తగ్గొచ్చు’ అని పేర్కొంటున్నారు. కొనేముందు అసలు ధరతో EMI ధర కంపేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.