News April 24, 2024

స్టీల్ ప్లాంటుపై మొదట గళమెత్తింది మేమే: జగన్

image

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలతో CM జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, వైసీపీ.. కార్మికులకు అండగా నిలుస్తాయని జగన్ భరోసానిచ్చారు. కార్మికుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే మొదట గళమెత్తిందని, ప్రధానికి లేఖ రాశామని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు ఇప్పుడు జట్టుకట్టాయని, కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. కేంద్రంపై నిరంతరంగా ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, కార్మికుల మద్దతు కోరే నైతికత వైసీపీకి ఉందని వ్యాఖ్యానించారు.

Similar News

News November 28, 2025

సర్పంచ్‌గా మొదలై.. 5 సార్లు MLAగా గుమ్మడి నర్సయ్య

image

ఖమ్మం(D) సింగరేణి(M) టేకులగూడేనికి చెందిన గుమ్మడి నర్సయ్య రాజకీయాల్లో సుపరిచితం. ఆయన రాజకీయ జీవితం మొదటగా సొంత గ్రామానికి సర్పంచ్‌గా మొదలైంది. ఆ తర్వాత ఇల్లందు నుంచి CPI ML న్యూడెమోక్రసీ తరఫున ఏకంగా 5 సార్లు MLAగా గెలిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిస్వార్థ, నిరాడంబర ప్రజానేతగా పేరుగాంచిన గుమ్మడి నర్సయ్య జీవితం, నేడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నిజంగా ఆదర్శనీయం కదూ.

News November 28, 2025

సూర్యాపేట వాసికి నేషనల్ ఫార్మా అవార్డు

image

సూర్యాపేట వాసి డా.అనంతుల రవి శేఖర్‌కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన ఫార్మా క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 వేడుకలో ఆయనకు నేషనల్ ఇండియా ఫార్మా అవార్డు వరించింది. శాస్త్రవేత్తగా చేసిన ప్రయోగాత్మక సేవలకు సీపీహెచ్ఐ ఆర్గనైజింగ్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని రవి శేఖర్ తెలిపారు.

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్