News October 8, 2025

రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధిస్తాం: ఉత్తమ్

image

తెలంగాణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దీని నుంచి 1.48 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు. 90.46 లక్షల టన్నుల సన్నాలు, 57.84 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యం పంట చేతికొస్తుందని చెప్పారు. క్వింటాల్ సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని.. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం కొంటుందన్నారు.

Similar News

News October 8, 2025

20 ఏళ్ల కోసం నిర్మించి కూల్చేద్దామనుకున్నారు!

image

పారిస్‌లోని ఐఫిల్ టవర్‌ను 20 ఏళ్ల కోసమే 1889లో నిర్మించారనే విషయం మీకు తెలుసా? ఫ్రెంచ్ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు దీనిని నిర్మించారు. అందమైన పారిస్‌లో ఈ టవర్ అసహ్యకరంగా కనిపిస్తుందని అక్కడి ప్రముఖుల నుంచి విమర్శలూ వచ్చాయి. కానీ రేడియో టెలిగ్రాఫీ ఆవిష్కరణకు టవర్ ఉపయోగపడింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీనికున్న యాంటెన్నాలు జర్మన్ సైన్యం కదలికలపై కీలక సమాచారం అందించాయి.

News October 8, 2025

రైట్స్‌లో 9 ఇంజినీరింగ్ పోస్టులు

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) 9 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీఈ, బీటెక్/ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుంచి ఈనెల 17వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://rites.com/

News October 8, 2025

BC రిజర్వేషన్లపై విచారణకు లంచ్ బ్రేక్

image

TG: BC రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణకు లంచ్ బ్రేక్ ప్రకటించిన జడ్జి 2:30pm నుంచి వాదనలు వింటామన్నారు. అంతకుముందు వాదనల్లో.. ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించలేదు కాబట్టి పాత చట్టం అమల్లో ఉన్నట్లే అని, దీంతో జీవో చెల్లదని పిటిషనర్ వాదించారు. అటు బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లాక గడువులోపు సంతకం పెట్టకుంటే కేబినెట్‌కు వస్తుందని, మళ్లీ పంపినా తర్వాత సానుకూల నిర్ణయం రాకుంటే జీవో ఇవ్వాలన్నారు.