News September 9, 2024
వరద బాధితులకు దుస్తులూ పంపిణీ చేస్తాం: సీఎం చంద్రబాబు

AP: విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలతోపాటు దుస్తులు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు వెళ్లకుండా కబ్జాలు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, గత పాలకుల పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయని విమర్శించారు.
Similar News
News January 26, 2026
రాజ్యాంగంలో ప్రతి పేజీపై ‘PREM’.. ఆయన ఎవరంటే?

భారత రాజ్యాంగ మూల ప్రతిలో ప్రతి పేజీపై ‘ప్రేమ్’ అనే పేరు ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? ఆయనెవరో కాదు.. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. రాజ్యాంగ మూల ప్రతిని తన చేతిరాతతో రాసిన కళాకారుడు. దాదాపు 6 నెలల సమయాన్ని కేటాయించి అందంగా రాశారు. 251 పేజీలలో రాజ్యాంగాన్ని పూర్తి చేయగా.. ఎటువంటి వేతనం తీసుకోలేదు. బదులుగా ప్రతి పేజీపై తన పేరు, చివరి పేజీలో తన తాత పేరును రాసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.
News January 26, 2026
ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ అప్డేట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. RFCలో జరిగిన చిత్రీకరణలో నైట్ ఎఫెక్ట్ సీన్లు తీసినట్లు సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తోన్న ప్రజ్వల్ ఇన్స్టాలో వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయని సినీవర్గాలు చెబుతున్నాయి. NTR కెరీర్లోనే అత్యుత్తమ సినిమాగా ‘డ్రాగన్’ ఉండనున్నట్లు సమాచారం.
News January 26, 2026
భారత్కు కెనడా ప్రధాని! సంబంధాలు గాడిన పడినట్లేనా?

కెనడా PM మార్క్ కార్నీ మార్చిలో భారత్కు వచ్చే అవకాశం ఉంది. యురేనియం, ఎనర్జీ, మినరల్స్, AI వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉందని భారత్లోని ఆ దేశ హై కమిషనర్ దినేశ్ పట్నాయక్ వెల్లడించారు. USతో కెనడాకు ఈ మధ్య చెడింది. మరోవైపు కెనడా మాజీ PM ట్రూడో అధికారంలో ఉండగా భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో కార్నీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.


