News March 27, 2025
ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం: శ్రీధర్ బాబు

TG: సీఎం రేవంత్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని కొందరు కుట్ర చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. లగచర్ల ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే 2028 ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు.
Similar News
News February 12, 2026
టాస్ గెలిచిన నమీబియా.. భారత్ బ్యాటింగ్

టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్తో మ్యాచులో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ చేయనుంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ దూరమయ్యారు. అతడి ప్లేస్లో సంజూ శాంసన్ వచ్చారు. సిరాజ్ స్థానంలో బుమ్రా ఆడనున్నారు.
IND: శాంసన్, కిషన్, తిలక్, సూర్య, దూబే, రింకూ, హార్దిక్, అక్షర్, అర్ష్దీప్, చక్రవర్తి, బుమ్రా
News February 12, 2026
రూ.55,649 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

రోజుకో రీతిలో సాగుతున్న సైబర్ మోసాలతో ప్రజలు ₹వేలకోట్లు నష్టపోతున్నారు. గత 5 ఏళ్లలో 65,89,063 మంది బాధితులు ₹55,649 CR పోగొట్టుకున్నారు. ఈ మోసాలు ఏటేటా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. 2021లో 2,62,846 ఫిర్యాదులు రాగా ₹551 CR మోసపోయారు. అదే 2025లో 24,02,579లు కేసులు నమోదైతే మోసపోయిన సొమ్ము ₹22,495 CRకు చేరింది. కాగా 23.61 లక్షల కేసుల్లో ₹8189 కోట్లు కాపాడగలిగామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.
News February 12, 2026
అరవ శ్రీధర్ రావట్లేదా?.. అసెంబ్లీ లాబీలో చర్చ

AP: ఓ మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు <<19038842>>ఎదుర్కొంటున్న<<>> రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ గురించే ఇవాళ అసెంబ్లీ లాబీలో ఎక్కువసేపు చర్చ సాగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ అసెంబ్లీకి రావట్లేదా? అంటూ మిగతా ఎమ్మెల్యేలు చర్చించుకున్నారట. అయితే ఈ సెషన్ మొత్తానికి ఆయన్ను రావద్దని జనసేన అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. అటు బయట పార్టీ కార్యక్రమాల్లోనూ శ్రీధర్ కనిపించడం లేదు.


