News March 27, 2025

ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం: శ్రీధర్ బాబు

image

TG: సీఎం రేవంత్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని కొందరు కుట్ర చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. లగచర్ల ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే 2028 ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయొద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు.

Similar News

News December 31, 2025

ఎవరి జోక్యమూ లేదు.. చైనా మధ్యవర్తిత్వ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

image

భారత్-పాక్ మధ్య <<18718800>>మధ్యవర్తిత్వం<<>> చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం రెండు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితమేనని స్పష్టం చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని పలు వివాదాలను పరిష్కరించామన్న చైనా విదేశాంగ మంత్రి.. భారత్-పాక్ ఉద్రిక్తతలనూ తగ్గించామని చెప్పటంతో భారత్ స్పందించింది.

News December 31, 2025

2025: గోల్డ్‌ ₹57వేలు, వెండి ₹1.6L పెరిగింది!

image

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. JANలో 10gల బంగారం ధర ₹78,000 ఉండగా.. డిసెంబర్ 31న ₹1,35,880తో ముగించి ఇన్వెస్టర్లకు దాదాపు 78%(₹57k) లాభాలను అందించింది. అటు కిలో వెండి ధర 2025 ప్రారంభంలో ₹98,000 ఉండగా ప్రస్తుతం ₹2.58 లక్షలకు చేరుకొని 150%(₹160k) పైగా వృద్ధిని నమోదు చేసింది. కొత్త ఏడాదిలో గోల్డ్, సిల్వర్ ధరలెలా ఉంటాయో చూడాలి.

News December 31, 2025

పెద్దిరెడ్డి ఫ్యామిలీకి షాక్!

image

AP: జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి గట్టి షాక్‌ తగిలిందన్న చర్చ సాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరును అన్నమయ్య జిల్లాలో విలీనం చేశారు. ఇక ఆయన కుమారుడు, MP మిథున్ రెడ్డి స్థానం రాజంపేట, సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి సీటు తంబళ్లపల్లి సైతం చిత్తూరులో లేవు. దీంతో పెద్దిరెడ్డి హవాకు బ్రేక్‌ పడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.