News September 27, 2024
జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటాం: స్వామీజీలు

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేదు. దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. మరోసారి తిరుమలలో జగన్ డ్రామాకు తెరతీసే అవకాశం ఉంది. అలిపిరి దగ్గరే మాజీ సీఎంను అడ్డుకుంటాం.’ అని వారు హెచ్చరించారు.
Similar News
News December 8, 2025
70-20-10.. ఇదే ప్రమోషన్ ఫార్ములా!

ప్రమోషన్ ఇవ్వడానికి 70-20-10 ఫార్ములాను కంపెనీలు ఫాలో అవుతాయి. 70% వర్క్ ఎక్స్పీరియన్స్, 20% మెంటార్షిప్, ఫీడ్బ్యాక్, కోచింగ్, 10% కోర్సులు, ట్రైనింగ్ ఆధారంగా ప్రమోషన్ ఇస్తాయి. ప్రాజెక్టులు డీల్ చేసిన విధానం, చిన్న టీమ్స్ లీడ్ చేయడం, తోటి ఉద్యోగుల ఫీడ్బ్యాక్, ఫ్రెషర్స్కు ఇచ్చిన ట్రైనింగ్, ఒత్తిడిని అధిగమించడం, క్లిష్ట సమయాల్లో ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుని ప్రమోషన్లు ఇస్తాయి.
News December 8, 2025
TG గ్లోబల్ సమ్మిట్.. మంత్రులు ఏమన్నారంటే?

* ఫీనిక్స్ పక్షి మాదిరిగా వివిధ రంగాల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా TGని మారుస్తాం: శ్రీధర్ బాబు
* రాష్ట్రాన్ని ప్రపంచ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం: రాజనర్సింహ
* పర్యావరణం, ప్రజారోగ్యం, ఇంధన భద్రత కోసం క్లీన్ మొబిలిటీకి ప్రాధాన్యం: పొన్నం
* పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తాం: జూపల్లి
* 2047నాటికి మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 90శాతానికి పెంచడమే లక్ష్యం: సీతక్క
News December 8, 2025
విదేశాల్లో వాస్తు పాటిస్తారా?

‘వాస్తు నియమాలు నిర్ధిష్ట ప్రాంతానికి పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడ నివసించినా, వ్యక్తిగత అలవాట్లు వేర్వేరుగా ఉన్నా, పంచభూతాల నియమాలు ఎవరూ విస్మరించలేరు. ప్రపంచంలో వాస్తు సూత్రాలను నిర్లక్ష్యం చేస్తే అది జీవన మనుగడకే ముప్పుగా మారొచ్చు. వాస్తును ప్రాంతాల వారీగా విభజించడం, ఓ ప్రాంతానికే పరిమితం చేయడం అపోహ మాత్రమే. ఈ నియమాలు విశ్వమంతటా పాటించదగినవి’ అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు.


