News September 27, 2024
జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటాం: స్వామీజీలు
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేదు. దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. మరోసారి తిరుమలలో జగన్ డ్రామాకు తెరతీసే అవకాశం ఉంది. అలిపిరి దగ్గరే మాజీ సీఎంను అడ్డుకుంటాం.’ అని వారు హెచ్చరించారు.
Similar News
News September 27, 2024
కుప్పకూలిన బంగారు గని.. 15 మంది మృతి
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ సుమత్రలో కొండచరియలు విరిగిపడటంతో అక్రమ బంగారు గని కుప్పకూలి 15 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. రిమోట్ ఏరియా కావడంతో రవాణా సదుపాయం సరిగా లేదని వెల్లడించారు. దీంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు.
News September 27, 2024
కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నమోదు
కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నిర్ధారణ అయ్యింది. ఎర్నాకుళం వాసికి పరీక్షల్లో వైరస్ పాజిటివ్గా తేలినట్టు కేరళ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఏ స్ట్రెయిన్ అన్నది ఇంకా నిర్ధారణకాలేదు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. Sep 18న కేరళలోని మలప్పురంలో UAE నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ పాజిటివ్గా తేలడంతో దేశంలోనే మొదటి కేసు నమోదైంది.
News September 27, 2024
ఆ డేటింగ్ యాప్లో హీరోలూ ఉన్నారు: ఊర్వశీ రౌతేలా
తనతోపాటు చాలా మంది సెలబ్రిటీలు ‘రాయ’ డేటింగ్ యాప్లో ఉన్నారని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తెలిపారు. మాట్లాడుకోవడం కోసమే ఈ యాప్లో చేరినట్లు ఆమె చెప్పారు. హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్ కపూర్, అర్జున్ కపూర్ వంటి స్టార్లు యాప్లో చేరారని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ కోసమే ఈ యాప్లో చేరానని, దీనిని మరో కోణంలో చూడొద్దని ఆమె అన్నారు. కాగా టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్తో ఊర్వశి డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి.