News September 27, 2024

జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటాం: స్వామీజీలు

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేదు. దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. మరోసారి తిరుమలలో జగన్ డ్రామాకు తెరతీసే అవకాశం ఉంది. అలిపిరి దగ్గరే మాజీ సీఎంను అడ్డుకుంటాం.’ అని వారు హెచ్చరించారు.

Similar News

News November 21, 2025

AIతో జవాబు పత్రాల వాల్యుయేషన్!

image

TG: విద్యార్థుల ఆన్సర్ షీట్లను లెక్చరర్లతోనే కాకుండా AI ద్వారా దిద్దించాలని రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా పాలిటెక్నిక్‌లో 2 సబ్జెక్టుల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కావడంతో AI ద్వారా దిద్దిన పేపర్లను లెక్చరర్లతో మరోసారి చెక్ చేయించనున్నారు. రైటింగ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. వాటిని ఏఐ ఎలా దిద్దుతుందనేది ఆసక్తికరం.

News November 21, 2025

శ్రీవారికి సుప్రభాత సేవ నిర్వహించేది ఇక్కడే..

image

తిరుమామణి మండపం దాటాక కనిపించే సుందర సన్నిధే బంగారు వాకిలి. ఈ వాకిలికి పూర్తిగా బంగారు రేకుల తాపడం ఉంటుంది. దీనికి ఇరువైపులా శ్రీవారి ద్వారపాలకులు అయిన జయవిజయుల పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీవారికి రోజూ చేసే తొలి సేవ అయిన సుప్రభాత సేవ ఈ బంగారు వాకిలి దగ్గరే మొదలవుతుంది. అన్నమాచార్యులు తమ కీర్తనల్లో ‘కనకరత్నకవాటకాంతు లిరుగడ గంటి’ అని వర్ణించింది కూడా ఈ దివ్య బంగారు వాకిలినే. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 21, 2025

TG వెదర్ అప్‌డేట్.. ఈనెల 23 నుంచి వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఈనెల 23 నుంచి 25 వరకు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు పొడి వాతావరణం నెలకొంటుందని, రాబోయే 2 రోజుల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది. నేడు ADB, JGL, KMR, ASF, MNCL, MDK, NML, NZB, SRCL, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11-15°C ఉంటాయని, మిగతా జిల్లాల్లో >15°Cగా నమోదవుతాయని తెలిపింది.