News March 25, 2024
రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తాం: చంద్రబాబు

AP: టీడీపీ, జనసేన, బీజేపీల అజెండా ఒక్కటేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్నారు. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాల్లో గెలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛన్ ఇంటికే తెచ్చిస్తామని ప్రకటించారు. ముస్లింల 4శాతం రిజర్వేషన్లు కాపాడింది తమ పార్టీయేనని బాబు గుర్తు చేశారు.
Similar News
News November 26, 2025
లోకేశ్.. ఇది పబ్లిసిటీ స్టంట్: YCP

AP: రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల పేరుతో <<18388550>>వ్యక్తిగత దాడులు వద్దంటూ<<>> మంత్రి లోకేశ్ చెప్పడం ఒక పబ్లిసిటీ స్టంట్ అని YCP విమర్శించింది. ‘మీరు, మీ తండ్రి ఆన్లైన్ క్యారెక్టర్ అసాసినేషన్ కల్చర్కు స్పాన్సర్లు. HYD నుంచి పెయిడ్ ట్రోల్స్ నడిపిస్తారు. జగన్&ఫ్యామిలీని ఎన్నో ఏళ్లుగా అవమానిస్తున్నారు. ముందు మీ నుంచి మార్పు మొదలెట్టండి’ అంటూ గతంలో YCP నేతలను కూటమి సపోర్టర్స్ విమర్శించిన వీడియోలను షేర్ చేసింది.
News November 26, 2025
తాజా సినిమా కబుర్లు

✦ ‘వారణాసి’ మూవీలో మహేశ్ బాబు చిన్ననాటి పాత్రలో సుధీర్ బాబు కొడుకు ‘దర్శన్’?: సినీ వర్గాలు
✦ ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్పై విమర్శలు.. కథ, సందర్భం, డైరెక్టర్ విజన్కు తగినట్లు పాట ఉంటుంది. ప్రతీ పాట ఎలివేషన్లా ఉంటే బోర్ కొడుతుందన్న లిరిసిస్ట్ రామజోగయ్య
✦ రవితేజ, శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా ప్రియ భవాని శంకర్?
✦ ‘MAD’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంతో కార్తీ హీరోగా సినిమా?
News November 26, 2025
పెట్టుబడులకు గమ్యస్థానంగా HYD నిలవాలి: CM

అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా HYD నిలిచేలా TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ‘ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి అంశాన్ని హైలైట్ చేయాలి. పెట్టుబడిదారులకు సిటీలోని అనుకూలాంశాలు, రాష్ట్ర కళా, సాంస్కృతిక, భాష, వాతావరణ అనుకూలతను వివరించాలి. ప్రముఖులకు బ్రాండింగ్లో చోటు కల్పించాలి’ అని సమ్మిట్ బ్రాండింగ్పై జరిగిన సమీక్షలో సూచించారు.


