News April 14, 2025

అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం: CM

image

AP: అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు(D) పొన్నెకల్లులో మాట్లాడుతూ ‘పేదలకు అండగా ఉంటాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తాం. అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీలను తీసుకొస్తాం’ అని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-24 మధ్య చూశానని, తనలాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు.

Similar News

News September 15, 2025

‘మిరాయ్’లో రాముడి రోల్ చేసింది ఎవరంటే?

image

‘మిరాయ్’లో రాముడి పాత్ర AIతో రూపొందించలేదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ క్యారెక్టర్‌లో బాలీవుడ్ నటుడు గౌరవ్ బోరా కనిపించారని పేర్కొన్నాయి. హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ చేసిన డెహ్రడూన్‌కు చెందిన ఈ యాక్టర్ పలు కమర్షియల్ యాడ్స్‌లోనూ కనిపించారు. అయితే మూవీలో ఫేస్‌ను రివీల్ చేయకుండా డైరెక్టర్ కార్తీక్ జాగ్రత్తపడ్డారు. అంతకుముందు ఈ రోల్ <<17686798>>ప్రభాస్<<>> కనిపించారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News September 15, 2025

నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్

image

అమెరికాలో భారతీయుడి <<17690207>>తల నరికివేసిన<<>> ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘క్యూబాకు చెందిన అక్రమ వలసదారు భార్యాబిడ్డల ముందే చంద్ర నాగమల్లయ్యను కిరాతకంగా చంపేశాడు. అతడు గతంలో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతడిని క్యూబా తమ దేశంలోకి తీసుకునేందుకు నిరాకరించింది. బైడెన్ అసమర్థతతో జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరస్థుడిని కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులను వదలం’ అని హెచ్చరించారు.

News September 15, 2025

స్పీకర్‌కు అభ్యంతరాలు తెలపనున్న BRS నేతలు

image

TG: పార్టీ ఫిరాయింపుల నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై అభ్యంతరాలు తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలవనున్నారు. ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలుంటే మూడ్రోజుల్లోగా తెలపాలని సూచించిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించిన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇవాళ మరిన్ని ఆధారాలు సమర్పించాలని నిర్ణయించింది. నోటీసులు అందుకున్న MLAల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణ అందజేయాల్సి ఉంది.