News July 26, 2024
కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెప్పిస్తాం: పవన్ కళ్యాణ్

AP: చిత్తూరు, మన్యం జిల్లాల్లో ఏనుగులు పంటలు ధ్వంసం చేయడాన్ని అడ్డుకోవాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ‘పొలాలు, ఇళ్లలోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపేందుకు కావాల్సిన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తెప్పిస్తాం. ఆ ప్రభుత్వంతో మాట్లాడుతా. జంతువులు రాకుండా పొలాల్లో ఏర్పాటు చేసే విద్యుత్ ఫెన్సింగులు వద్దని ప్రజలకు వివరించాలి’ అని ఆయన చెప్పారు.
Similar News
News October 28, 2025
‘మొంథా’ తుఫాను సమాచారం.. ఎప్పటికప్పుడు!

మొంథా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్డేట్లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.
News October 28, 2025
విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జర్మనీలో మెకానిక్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/
News October 28, 2025
పొట్టి కప్ అయినా పట్టేస్తారా?

ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రేపటి నుంచి 5 మ్యాచుల T20 సమరానికి సిద్ధమైంది. బుమ్రా జట్టులోకి రానుండటం ప్లస్ కానుంది. అతడి సారథ్యంలో పేస్ దళం AUSను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి. అటు యంగ్ ఇండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది.
స్క్వాడ్: సూర్య, అభిషేక్, గిల్, తిలక్, నితీశ్, దూబే, అక్షర్, జితేశ్, వరుణ్, బుమ్రా, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్, సంజూ, రింకూ, సుందర్


