News July 26, 2024
మధ్యతరగతి కోసం మరిన్ని పథకాలు తెస్తాం: నిర్మలా సీతారామన్

మధ్యతరగతి ప్రజల కోసం మరిన్ని స్కీమ్స్ తెచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒక స్కీమ్/అంశంపైనే దృష్టి సారించడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మిడిల్ క్లాస్ కోసం స్టాండర్డ్ డిడక్షన్ ₹75వేలకు పెంచామని, పిల్లల చదువులకు ₹10లక్షల వరకు సబ్సిడీ లోన్ సదుపాయం తెచ్చామన్నారు. విదేశాల్లో భారతీయులు ఖర్చు చేసే పరిమితిని పెంచామన్నారు.
Similar News
News December 20, 2025
పెదవులు పగులుతున్నాయా? ఇది కూడా కారణం కావొచ్చు

శీతాకాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగలడం కామన్. అయితే వాతావరణం వల్ల మాత్రమే కాదు, శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. విటమిన్ బి12 లోపం వల్ల ఈ సమస్య ఎదురవుతుందంటున్నారు. దీనికోసం మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు. శాకాహారులు పాలకూర, జున్ను, పాలు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో చేర్చుకోవచ్చని చెబుతున్నారు.
News December 20, 2025
T20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది.
టీమ్: సూర్య (C), అక్షర్ పటేల్ (Vc), అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, రింకూ సింగ్, అర్ష్దీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, సుందర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్.
– వన్డే, టెస్ట్ జట్ల కెప్టెన్ గిల్కు చోటు దక్కలేదు
News December 20, 2025
KTR, హరీశ్ రావులకు KCR కీలక బాధ్యతలు

TG: పంచాయతీ ఎన్నికల ఫలితాలను BRS చీఫ్ KCR విశ్లేషించారు. ఫలితాలు పార్టీకి సానుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. రానున్న MPTC, ZPTC, MNP ఎన్నికల్లోనూ మరింత దూకుడుతో వెళ్లాలని పార్టీ సీనియర్లకు సూచించారు. దీనికోసం మున్సిపల్ ఎన్నికల బాధ్యతను పట్టణ ఓటర్లలో ఇమేజ్ ఉన్న KTRకు అప్పగించారు. అలాగే సీనియర్ నేత హరీశ్ రావు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించనున్నారు.


