News August 4, 2024
అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మిస్తాం: SRM యూనివర్సిటీ

AP: అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి, మెడికల్, డెంటల్ కాలేజీలతో పాటు AI యూనివర్సిటీ, స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు SRM యూనివర్సిటీ ముందుకొచ్చింది. వీటి ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం కేటాయించాలని SRM ప్రభుత్వాన్ని కోరుతోంది. కాగా నీరుకొండలో 2017లో ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన SRM యూనివర్సిటీలో ప్రస్తుతం 12వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
Similar News
News October 23, 2025
అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే ఫ్యాక్ట్ చెక్

భారత రైల్వేకు సంబంధించి అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్ చెక్ను తీసుకొచ్చింది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు X హ్యాండిల్ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. రైల్వేల గురించి తప్పుదారి పట్టించే లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే <
News October 23, 2025
ఆకుకూరల్లో చీడపీడల నివారణకు సూచనలు

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆకుకూరల పంటల్లో అనేక చీడపీడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన తెల్లని బొడిపెలు, పైభాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి పండు బారుతున్నాయి. వీటి నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు ఆకులను కొరికి తింటుంటే లీటరు నీటికి కార్బరిల్ మందును రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News October 23, 2025
నేడు అన్నాచెల్లెళ్ల పండుగ.. మీరు చేస్తున్నారా?

రాఖీ లాగే కార్తీక శుక్ల పక్ష విదియ నాడు ‘భాయ్దూజ్’ పేరిట అన్నాచెల్లెళ్ల పండుగ నిర్వహిస్తారు. ఈ శుభదినాన యమునా దేవి తన సోదరుడు యముడికి ఆప్యాయంగా భోజనం పెట్టి, ఆయనకు అపమృత్యు భయం లేకుండా దీవించిందట. అందుకే సోదరీమణులు ఈ పర్వదినాన తమ సోదరులను ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెడతారు. సోదరుడు, సోదరి చేతి భోజనం తింటే దీర్ఘాయుష్షు కలుగుతుందని నమ్ముతారు. మీరు ఈ పండుగ చేస్తున్నారా? COMMENT