News April 3, 2024
ఉగ్రదాడి సూత్రదారులందర్నీ పట్టుకుంటాం: పుతిన్

మాస్కోలో ఉగ్రదాడి ఘటనతో భారీ మూల్యం చెల్లించుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులందర్నీ పట్టుకుంటామని చెప్పారు. దేశాన్ని విచ్చిన్నం చేసేలా ప్రజల్లో భయాందోళనలు, కలహాలు, ద్వేషాన్ని నాటేందుకు కొందరు యత్నించారని.. అటువంటి వాటిని అనుమతించకూడదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 140 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
Similar News
News November 16, 2025
శుభ సమయం (16-11-2025) ఆదివారం

✒ తిథి: బహుళ ద్వాదశి తె.5.09 వరకు ✒ నక్షత్రం: హస్త రా.3.26 వరకు ✒ శుభ సమయాలు: ఏమీ లేవు. ✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు ✒ యమగండం: మ.12.00-1.30 ✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13, ✒ వర్జ్యం: ఉ.10.49-మ.12.30 ✒ అమృత ఘడియలు: రా.9.01-10.51
News November 16, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
*విశాఖ స్టీల్ ప్లాంటును తెల్ల ఏనుగుతో పోల్చిన చంద్రబాబు
*ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్, MLA నవీన్ యాదవ్
*హిందూపురంలో మా కార్యాలయంపై టీడీపీ దాడి చేసింది: వైఎస్ జగన్
*రాజమౌళి-మహేశ్ బాబు సినిమా టైటిల్ ‘వారణాసి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
*సౌతాఫ్రికాతో టెస్టు.. విజయానికి చేరువలో భారత్
News November 16, 2025
పాకిస్థాన్ నుంచి డ్రోన్లతో బాంబులు, డ్రగ్స్ సరఫరా

పాక్ నుంచి డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చైన్ను NIA రట్టు చేసింది. ప్రధాన వ్యక్తి విశాల్ ప్రచార్ అరెస్టు చేసి తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పాక్ బార్డర్లలో డ్రోన్ల ద్వారా వచ్చే ఆర్మ్స్, డ్రగ్స్, అమ్మోనియం వంటి వాటిని గ్యాంగుల ద్వారా పంజాబ్, హరియాణా, రాజస్థాన్కు చేరవేస్తున్నారని పేర్కొంది. సామాజిక అస్థిరత సృష్టించేలా ఈ గ్యాంగులు పనిచేస్తున్నాయని NIA వివరించింది.


