News April 6, 2024
వెంటాడి మరీ హతమారుస్తాం: రాజ్నాథ్ సింగ్

దేశంలో ఎవరైనా ఉగ్రదాడులకు పాల్పడి పాకిస్థాన్లో తలదాచుకోవాలని ప్రయత్నిస్తే ఆ దేశంలోకి వెళ్లి మరీ హతమారుస్తామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ‘పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే కోరుకుంటాం. కానీ ఎవరైనా భారత్లో ఉగ్రదాడులకు ప్రయత్నిస్తే సహించం’ అని తెలిపారు. కాగా 2020 నుంచి ఇప్పటివరకు పాక్లో 20 మందిని భారత ఏజెంట్లు చంపారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.
News December 5, 2025
పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వర్తించదు.


