News July 9, 2024

2026 నాటికి ‘భోగాపురం’ పూర్తి చేస్తాం: రామ్మోహన్ నాయుడు

image

AP: 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దీని నిర్మాణంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ‘విమానాశ్రయం పనులను గత ప్రభుత్వం జాప్యం చేసింది. మొత్తం 2,700 ఎకరాల్లో 500 ఎకరాలు కుదించేందుకు యత్నించింది. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నాం. దేశంలోనే నంబర్‌వన్ ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 15, 2024

RED ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనిప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలకు <>రెడ్ అలర్ట్,<<>> బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 15, 2024

కృష్ణ జింకల కోసం ప్రాణాలను సైతం పణంగా..!

image

బిష్ణోయ్ తెగ ప్రజలు కృష్ణ జింక‌ల్ని వారి ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుని పునర్జన్మగా భావిస్తుంటారు. 15వ శతాబ్దంలో 29 సూత్రాలతో గురు జంభేశ్వర్ (జంబాజీ) బిష్ణోయ్ సంఘాన్ని స్థాపించారు. ఇందులో వన్యప్రాణులు, వృక్షసంపదను రక్షించాలని ఉంది. బిష్ణోయ్ తెగ వారు జింకలుగా పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. ఈ జంతువులను రక్షించడానికి బిష్ణోయిలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని చరిత్రకారుడు వినయ్ పరిశోధనలో తేలింది.

News October 15, 2024

‘ఆమడ దూరం’ వెళ్లొస్తా.. అంటే ఎంత దూరం?

image

పూర్వీకులు ఆమడ దూరం అనే పదాన్ని ఎక్కువగా వాడేవారు. ఏదైనా ప్రాంతం ఎంత దూరంలో ఉందో చెప్పేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే, ఇలా చెప్పేవారికీ అది ఎంతదూరమో తెలియదనేది వాస్తవం. ఆంగ్లేయులు రాకముందు భారతీయులు కొలతల్లో ‘ఆమడ’ను వినియోగించేవారు. దీన్నే యోజనం అని కూడా పిలుస్తారు. అతి చిన్న కొలత అంగుళమైతే.. అతిపెద్దది ‘ఆమడ’. 8 మైళ్ల దూరాన్ని ఆమడ అంటారు. అంటే దాదాపు 13 కిలోమీటర్లని పెద్దలు చెప్తుంటారు.