News November 11, 2024
ఈ సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: పయ్యావుల

AP: ప్రతి పొలానికి సాగు నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జల విధానాన్ని రూపొందిస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్నారు.. చింతలపూడి, వంశధార రెండో దశ, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, టీబీపీ-హెచ్ఎసీ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. గోదావరి-పెన్నా, నాగావళి-వంశధార నదులను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.
News December 9, 2025
‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.
News December 9, 2025
IIIT కొట్టాయంలో ఉద్యోగాలు

<


